DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయాల రక్షణ భక్తుల భాద్యతే : విద్యాశంకర భారతీ 

*విశాఖ కు పుష్పగిరి పీఠాధిపతుల ధర్మపరిరక్షణ యాత్ర* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 30, 2021  (డి ఎన్ ఎస్):* ప్రతి దేవాలయాన్ని హిందుభక్తులే పరి రక్షించుకోవాలని పుష్పగిరి శ్రీ శంకరాచార్య  మహా సంస్థానం పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి పిలుపునిచ్చారు.

ధర్మపరిరక్షణ యాత్రలో భాగంగా అయన శనివారం విశాఖపట్నం విచ్చేశారు. సీతమ్మధార లోని  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణ లో విలేకరుల సమావేశం నిర్వహించి, తమ పర్యటన వివరాలను తెలియచేసారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ శంకర వైభవ సంబంధం పీఠాధిపతుల అందరి ప్రతినిధిగా ఉత్తరాంధ్ర చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి

ఆలయాన్ని హిందువులే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని హిందూ ధర్మ ఐక్యత కొరకు పటిష్టత కొరకు కొన్ని విషయాలు వివరించారు. 
పీఠాధిపతుల ఆగమనం తెలుసుకుని విశాఖ జిల్లా దేవాదాయ శాఖా సహాయ కమిషనర్ కె. శాంతి, ఇతర అధికార, అనధికారులు ఆలయానికి విచ్చేసి, పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఉదయం సింహాచలం క్షేత్ర

సందర్శించి శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ని సేవించుకున్నారు. 
సాయంత్రం బురుజు పేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నారు. అనంతరం విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థ క్షేత్రం సందర్శనకు, తదుపరి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి, శ్రీకూర్మం క్షేత్రాలలో కూడా పర్యటించనున్నారు.

 

ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక దర్శనం సంపాదకులు ఎం. వి ఆర్ శర్మ ఈ యాత్రలో స్వామి తో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam