DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి, శ్రీకూర్మ గుళ్లకు బరాటం రూ.2 లక్షల విరాళం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, ఫిబ్రవరి 01, 2021  (డి ఎన్ ఎస్):* జిల్లాకు చెందిన సంఘ సేవకులు బరాటం కామేశ్వరరావు, రాజ్యలక్ష్మీ దంపతులు, శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధ హిందూ దేవాలయాలైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి, శ్రీకూర్మం లోని శ్రీకూర్మనాధ స్వామి

దేవాలయాలకు నిత్యాన్న పధకాలకు చెరో లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. సోమవారం కుమారుడు సతీష్‌ దివ్యతో కలిసి  కుటుంబ సమేతంగా ఆలయాలకు వచ్చిన వారు శ్రీకూర్మం క్షేత్రంలో నిత్యాన్న పధక విరాళం రూ. లక్షను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ఆలయ ఈవో కు అందించగా, అరసవల్లి నిత్యాన్నదానానికి యువనేత ధర్మాన

రామ్‌మనోహర్‌నాయుడు చేతుల మీదుగా ఆలయ ఈవో హరి సూర్యప్రకాష్‌కు అందించారు. 

ఈ కుటుంబానికి అరసవల్లి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈ కుటుంబ సభ్యులు ఉన్నతమైన సేవందిస్తున్నారని కొనియాడారు. సమాజానికి మంచి చేసే ఇలాంటి కుటుంబం ఎల్లవేళలా

తాము చేయూతను అందిస్తామని ధర్మాన చెప్పారు. నిండు నూరేళ్లు బరాటం కామేశ్వరరావు స్వామి అనుగ్రహంతో మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam