DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బడ్జెట్ లో ఏపీ కి రిక్తహస్తమే: మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 01, 2021  (డి ఎన్ ఎస్):* 2021-2022 కేంద్ర బడ్జెట్ సామాన్యుల నడ్డి విరిచెదిగా ఉందని తెలుగుదేశం నర్సాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ  తోట సీతరామలక్ష్మి అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ నర్సాపురం లోని పార్టీ కార్యాలయంలో స్పందిస్తూ బడ్జెట్

పూర్తి పాఠం లో ఆంధ్రప్రదేశ్ గురుంచి ఎక్కడ మాటే లేదు పోలవరం కి నిధుల ఉసెలేదు, స్పెషల్ స్టేటస్ గురుంచి మాటే లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి 22 మంది ఎంపిలు ఉండి   రాష్ట్రానికి సాధించింది శూన్యం 25 మంది ఎంపీ లను ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతం అన్న జగన్ 22 మంది కేంద్రం ముందు మోకరిల్లారన్నారు.  వంటనూనెల పై భారీగా 20 నుంచి 30

శాతం ఆగ్రి ఇంఫ్రా సెస్ విధించారు.దీని వలన వంట నూనె ధరలు భారీగా పెరగ నున్నాయి.మధ్యం ఉత్పత్తులపై 100% సెస్ వలన మధ్యం ధరలు భారీగా పెరగనున్నాయని తెలిపారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు బారీగా నిధులు కేటాయించారని, బిజెపి పాలిత రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు ఇచ్చారని, మన రాష్ట్రానికి ఎమీ కేటాయింపులు లేవని, పైగా విశాఖ రైల్వే

జోన్, ప్రత్యెక హోదా మాటకూడా కనపడలేదన్నారు. జాతీత రహదారుల అభివృద్దికి 1 లక్షా పదివేల కోట్లు జాతీయ రహదారుల అభివృద్దికి మన రాష్ట్రం సాదించింది శూన్యం.
తమిళనాడు, అస్సాం, బెంగాల్, కేరళలలో ఎన్నికల దృష్ట్యా జాతీయ రహదారుల అభివృద్దికి ఎక్కువ కేటాయింపులు పోలవరం ఊసే లేదు రైల్వే బడ్జెట్ కు కేటాయింపులు 1 లక్షా

పద్దెనిమిదివేల కోట్లు రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్ట్ ఏమీ లేదు రైల్వే జోన్ ఊసేలేదు. విశాఖ విజయవాడ మెట్రో ఊసేలేదన్నారు. కోవిడ్ వలన అనేక మంది ఉపాది కోల్పోయారని, వారికి పని కల్పించడం కోసం కోవిడ్ వలన మూతబడిన పరిశ్రమల పునరుద్దరణకు ప్రత్యేక చర్యలు లేవు దీని వలన నిరుద్యోగం పెరుగుతుంది.బడ్జెట్ కేటాయింపులు

ఇంపుగా ఉన్నాయి వాటికి రాబడి ఏ విధంగా వస్తుందో చెప్పలేదు.రాబడులు కోసం ఇలా దొడ్డి దారిన సెస్ లు వేసి కేటాయింపులు చేస్తున్నారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam