DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర తిరువాయూర్ లో వైభవంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు

*తిరువీధి, అనంతరం పంచరత్న సేవతో సంగీత నీరాజనం*

*ఉత్సవాల నిర్వహణకు ట్రస్టీ రాజు రూ. 5 లక్షల విరాళం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2021  (డి ఎన్ ఎస్):* సంగీత సరస్వతి, ప్రముఖ వాగ్గేయకారులు, త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను ఆంధ్ర తిరువాయూర్ గా

కొనియాడబడుతున్న విశాఖపట్నం కళాభారతి వేదికగా మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి 

ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( కళాభారతి రాంబాబు ) తెలిపారు. ఆదివారం కళాప్రాంగణం వద్ద ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు  పై మాట్లాడుతూ వర్ధమాన, ఔత్సాహిక, సీనియర్

కళాకారులందరితోనూ సంగీతోత్సవాలను గత 27 ఏళ్లుగా ఎంతో వైభవంగా విశాఖనగరం నిర్వహిస్తున్నామన్నారు.

ఫిబ్రవరి రెండు త్యాగరాజస్వామి వారి పుణ్యతిథి అయిన పుష్య బహుళ పంచమి అనీ, ఒకరోజు ముందు ఉత్సవాలు ప్రారంభిస్తున్నామనీ తెలిపారు. 

కళాభారతి కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు ) త్యాగరాజ స్వరూపంతో

సారధ్యంలో కళా ప్రాంగణం పరిసరాల్లో వైభవంగా తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం సభ ప్రాంగణం లో వర్ధమాన స్థాయి నుంచి ఉన్నత స్థాయి కళాకారులూ పంచరత్న కృతులతో త్యాగరాజ స్వామికి సంగీత నీరాజనం అందించారు.  

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగీత విశ్వ ప్రఖ్యాత మృదంగ కళాకారులూ, మృదంగ రత్నాకర వి. కమలాకర రావు

పాల్గొన్నారు. 

ఫిబ్రవరి 2 నుంచి కచేరీలు :   

పంచరత్న సేవ అనంతరం గురువిల్లి అప్పన్న బృందం చే సన్నాయి వాయిద్య కచేరి తో సంగీత కచేరిలు సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగనున్నాయన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివి గల సంగీత కార్యక్రమాలు జరుగుతాయి.  
ఆఖరు

రోజైన 6 వ తేదీన సాయంత్రం 8 గంటలకు ఆంజనేయ ఉత్సవం, హనుమాన్ చాలీసా పారాయణం, చతుర్వేద పారాయణం, 108 వడల మాల సమర్పణ, మంత్రపుష్పం,  మంగళ హారతి, ప్రసాద వితరణతో ఆరు రోజుల త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ముగుస్తాయన్నారు.  

కరోనా రక్షణ హెచ్చరికలు :

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నందున అత్యంత పటిష్టమైన

నిబంధన చర్యలను పాటిస్తున్నామన్నారు. కళా ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ముఖానికి మాస్కు లు ధరించాలన్నారు. ముఖ మాస్కు లేనివారికి ప్రాంగణంలోకి ప్రవేశం లేదన్నారు. అదే విధంగా ఆడిటోరియం లో సీటింగ్ లో ఒక కుర్చీ తర్వాత రెండవ కుర్చీ ఖాళీగానే ఉంటుందన్నారు. దానికి సీల్ వేసేశామన్నారు. ప్రతి గెట్ వద్ద శానిటైజర్

లు అందుబాటులో ఉంటాయన్నారు. 

ఈ ఏడాది మొత్తం 608 మంది కచేరీల్లో పాల్గొంటున్నారన్నారు. సీనియారిటీని బట్టి ప్రముఖులకు ఎక్కువ సమయం కేటాయించామని, 15 నిమిషాల కచేరీలు ఆరు, 30 నిమిషాల కచేరీలు 27 ఉన్నాయని వివరించారు. ఎ- టాప్ గ్రేడ్ కళాకారులు ఆరుగురు, ఏ గ్రేడ్ పదిమందీ ఉన్నారన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam