DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*విశాఖ జిల్లా ఎన్నికల ఏర్పాట్లు భేష్, ఎస్ఈసీ నిమ్మగడ్డ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2021  (డి ఎన్ ఎస్):* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రేమేష్ కుమార్ మంగళవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

జిల్లాలో ఓటర్లకు ఎన్నికల పై మంచి అవగాహన కల్పించాలని విశాఖ వాసులు విజ్ఞులని, ఎన్నికల ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. జిల్లా అధికారులు శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఎక్కువ మంది ఎన్నికలో పాల్గొంటేనే

ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలిపారు. ఈసీ కి అన్ని పార్టీలు సమానమేనని, అందరినీ సమ దృష్టితో చూడటం తమ పని అన్నారు. అయితే ఏకగ్రీవాల కోసం ప్రచారాలు సరి కాదన్నారు. బుధవారం ఎలక్షన్ కమీషన్ కార్యాలయంలో నిఘా వ్యవస్థను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 85శాతం పోలింగ్  ఉన్నప్పుడు, విశాఖలో మాత్రం 70 శాతం పోలింగ్

దాటడం లేదు. ఇది కొంత అసంతృప్తిగా ఉంది. అయితే పోలింగ్ శాతం తగ్గడం అధికారుల తప్పుగా అనిపించడం లేదన్నారు. ప్రజలు అందరు ఓటు వేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు తప్పకుండా ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటింగ్ సమయం కూడా పెంచామన్నారు. రాజ్యాంగం చెప్పిందే ఎలక్షన్ కమీషన్ చెబుతోందని

తెలిపారు. 
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్, సంయుక్త కలెక్టర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam