DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవోపేతంగా సాగుతున్న విశాఖ త్యాగరాజ ఆరాధనోత్సవాలు

*ఆంధ్ర తిరువాయూర్ లో ఆకట్టుకున్న యశోద నందన్ గాత్రం* 

*కళాభారతి లో శ్రీరామ మందిర విరాళ కేంద్రం ఏర్పాటు:. . .*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):*  ఆంధ్ర తిరువాయూర్ గా కొనియాడబడుతున్న విశాఖ కళాభారతి లో త్యాగరాజ స్వామి వారి ఆరాధన

ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవరోజైన బుధవారం నాటి సంగీత నీరజనోత్సవం లో యువగాయకులు, ఇంజనీర్ టిపి యశోదా నందన్ గాత్రం ఆహుతులను ఆకట్టుకుంది. కచేరి అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతం పట్ల ప్రస్తుత యువత ఎంతో శ్రద్ధ చూపుతున్నారని, వారికి తగిన మార్గదర్శకం చేసే వారి ద్వారా వారిని

తీర్చిదిద్దవచ్చన్నారు. 

గత 28 ఏళ్లుగా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్సు అకాడమీ, కళాభారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 1 న ప్రారంభమయ్యాయి. రెండవ రోజున 150 మందికిపైగా కళాకారులు  త్యాగరాజ స్వామి వారి కీర్తనలు పాడుతూ తిరువీధి, అనంతరం 300 మంది కళాకారులతో త్యాగరాజ స్వామి వారి ఘన రాగ

పంచ కృతులను ఘనంగా బృందగానం చేశారు. 
ఈ ఉత్సవాల వైభవాన్ని చూసి ఆనందించిన త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ట్రస్టీ మంతెన సత్యనారాయణ రాజు రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. దాని మీద వచ్చే వడ్డీతో ప్రతి ఏటా  త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ వారు ఇచ్చే బిరుదు ప్రధానోత్సవ వానికి వాడాలని కోరారు. 

ఈ నెల 6 వరకూ జరిగే ఈ ఉత్సవాలలో ఉదయం 8

నుంచి రాత్రి 8 గంటల వరకు 10, 15, 30 నిమిషాలు నిడివిగల కచేరీలు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కళాకారులు సంగీత నీరాజనం అందిస్తున్నారు. 

శ్రీరామ మందిర విరాళ కేంద్రం:. . .

కోట్లాది మంది భక్తుల మనోభావాల చిరకాలవాంఛ అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి సేకరిస్తున్న విరాళాలను

విశాఖ లో కూడా అందుబాటు లో ఉండేవిధంగా, కళాభారతి లో ఒక కౌంటర్ ను ఏర్పాటు చేసారు. అయోధ్య ట్రస్ట్ అధికారిక ప్రతినిధులకు నేరుగా విరాళాలు ఇచ్చే అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ కౌంటర్ అందుబాటులో ఉండనుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam