DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం క్యాంప్ ఎక్కడ? పోర్ట్ గెస్ట్ హౌస్ లేదా హరిత గెస్ట్ హౌసా?*

*మార్చి లో  రాజధాని విశాఖకు మారనుందా? అవుననే సంకేతాలా?*

*విశాఖ లో జోరందుకుంటున్న ఊహాగానాలు? ఉత్సాహంలో క్యాడర్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం మహర్దశ కలిగేలా ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని ని విశాఖకు

తరలిస్తున్నట్టు అసెంబ్లీ లో సాక్షాత్తు ముఖ్యమంత్రే చేసిన ప్రకటన తెలిసిందే. అయితే ఏడాదిగా స్తబ్దత గా ఉన్న ఈ అంశం బుధవారం మరోసారి తెరపైకి వచ్చింది. తాడేపల్లి కార్యాలయం నుంచి ఏ తరహా సంకేతాలు వచ్చాయో తెలియదు కానీ, విశాఖ లోని పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ ( దసపల్లా హిల్స్) ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అంటూ మీడియా

వర్గాల్లోనే ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయితే మరి కొందరు ప్రతినిధులు పోర్ట్ గెస్టు హౌస్ అనుకూలంగా ఉండదని, గతంలోనే ప్రభుత్వ ప్రతినిధులు తేల్చేశారన్నారు. అయితే అదే బృందం బీచ్ రోడ్ లోని హరిత గెస్ట్ హౌస్ లో ఈ కార్యాలయం ఏర్పాటవుతున్నట్టుగా సమాచారం తెలుస్తోందంటూ సమాచారం తెలియచేస్తున్నారు. 
అయితే ప్రస్తుతం

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుందని, ఇప్పుడిప్పుడు కార్యాలయాన్ని తరలించే అవకాశం ఉండకపోవచ్చు, పైగా మార్చి నెల 14 వ తేదీన ఒక ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంతకీ అధికారికంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే తప్ప, నిజానిజాలు తెలిసే అవకాశం లేదు. అంతవరకూ ఎవరు ఏమి చెప్పినా

అన్నీ ఊహాగానాలు గానే మిగిలిపోతాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam