DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవతావాది కాశీబుగ్గ ఎసై శిరీష కు డిజిపి డిస్క్ అవార్డు

*తల్లి దండ్రులు నేర్పిన సేవాభావమే అవార్డు తెచ్చింది:శిరీష* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 05, 2021  (డి ఎన్ ఎస్):* నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సేవాభావం నేడు రాష్ట్ర పొలిసు ఉన్నతాధికారి చేతుల మీదుగా నాకు అవార్డు తెచ్చిపెట్టిందన్నారని కాశీబుగ్గ మహిళా ఎసై కె.

శిరీష తెలియచేసారు. చేసే వృత్తి కాఠిన్యమైనా మానవతావాదాన్ని చూపించి అనాధ మృతదేహాన్ని భుజం పై మోసుకుంటూ కిలోమీటర్ నడిచిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీష ను అభినందిస్తూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సేవా పురస్కారాన్ని అందించారు. శుక్రవారం విజయవాడలోని కార్యాలయం లో ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ

పురస్కారాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ధైర్యసాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, విధి నిర్వహణతో పాటు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్బంగా శిరీష మాట్లాడుతూ తానూ విధి నిర్వహణలో తన కర్తవ్యమ్ నిర్వహించామన్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఖాకి డ్రస్ చాలా మంది వేసుకుంటారని, అయితే ప్రజా సంరక్షణ తో కూడిన

సేవ చేసేది మాత్రం పోలిసులేనన్నారు. సమాజంలో ఒక ఆడపిల్లగా శవాన్ని మోయడం అందరూ వ్యతిరేకిస్తారని తెలిసినా, ఒక వృద్ధుణ్ణి అలా వదిలి పెట్టి వెళ్లలేక  అంబులెన్స్ వరకూ ఆ శవాన్ని మోసినట్టు తెలిపారు. విధి నిర్వహణలో చేసిన ఒక పనిని గుర్తించి, ప్రత్యేకంగా ప్రోత్సహించిన డిజిపి, ఇతర ఉన్నతాధికారులు, శ్రేయోభిలాషులు, అభినందనలు

తెలిపిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam