DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భీమవరం పంచాయతీ ఎన్నికల్లో భారీ తాయిలాలు 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 06, 2021  (డి ఎన్ ఎస్):* ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం గట్టిగానే కొనసాగుతోంది. అభ్యర్థులు గెలిచేందుకు సామ, దాన భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి

జిల్లా భీమవరం మండలం గూట్లపాడులో ఒక ఇంట్లో దాచిన ప్రెషర్ కుక్కర్‌లను స్క్వాడ్ టీం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఇంట్లో తనిఖీ చేసి 50 ప్రెషర్ కుక్కర్‌లను స్వాధీనం చేసుకున్నారు. 9వ తేదీన జరగబోయే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు కుక్కర్లను తెచ్చి దాచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్వాధీనం

చేసుకున్న కుక్కర్లను భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కుక్కర్లు ఎవరికి సంబంధించినవి అనే విషయంపై ఆరాతీస్తున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు, వస్తువులు ఎవరైనా పంపినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam