DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పునరాలోచన చేయాలి 

*విశాఖ ఉక్కుపై ప్రధానికి సీఎం వైఎస్ జగన్ లేఖ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 06, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని, భారత ప్రధాని నరేంద్ర మోడీ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ వ్రాసారు. శనివారం విశాఖ

ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధానికి వ్రాసిన లేఖ లో ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని, విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. 
విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా

స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చిందని, దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం ఫలితం అని,  నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనపరిచిందని, ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయని తెలిపారు. 
ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని వివరించారు. ఉత్పత్తి

ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని, స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవని, పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని సూచించారు. 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తిచేస్తున్నారని

తెలిపారు. 

డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చిందని, వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోందని, దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోందని

తెలిపారు. 

దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ. 3,472లు చొప్పున భారం పడుతోంది, సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయని, దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయన్నారు. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడంద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి

తీసెకెళ్లొచ్చునన్నారు.

బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందని తెలిపారు. వడ్డీరేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం తగ్గుతుందన్నారు. స్టాక్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలని, దీనివల్ల ఆర్థిక పునర్‌నిర్మాణం జరుగుతుందని

తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam