DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మదనపల్లె లో స్వాస్థ్య ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి

*సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమంలో పర్యటించిన రాంనాద్ కోవింద్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం/ చిత్తూర్,  ఫిబ్రవరి 07, 2021  (డి ఎన్ ఎస్):* చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపం లోని సత్ సంగ్ ఫౌండేషన్ లో 38 పడకల స్వాస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి, ఆశ్రమ నిర్మాణానికి  భారత

రాష్ట్రపతి  రామ్ నాథ్ కొవింద్ శంకు స్థాపన చేసారు. ఆదివారం ఆశ్రమ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి కి ఘన స్వాగతం లభించింది. తమ ఆశ్రమానికి భారత రాష్ట్రపతి రావడంతో చిన్నారులు, మహిళలు, ఆశ్రమ వాసులు ఆనందంలో మునిగిపోయారు. ఆశ్రమం లోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. విస్వ విద్యాలయం ఆవరణలో మొక్కలు

నాటారు. అదే ఆశ్రమం లోని భారత్ యోగ విద్య కేంద్రంను అయన ప్రారంభించారు. అలాగే సత్ సంగ్ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులు తో ముఖాముఖి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు తాము చేపడుతున్న విద్య, యోగ శిక్షణ, ఇతర సేవాకార్యక్రమాలను రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు వివరించారు. 
         ఈ కార్యక్రమంలో

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు శ్రీ.కె. నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ గౌ.యం. హరి నారాయణన్, అనంతపురం రేంజి డీ.ఐ. జీ.క్రాంతి రానా టాటా, ఎస్.పీ.సెంథిల్ కుమార్,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి,) వీరబ్రహ్మం,  అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సత్ సంగ్ ఫౌండర్ శ్రీ

యం.(ముంతాజ్ అలీ),సత్ సంగ్ విద్యాలయ డైరెక్టర్ స్టీఫెన్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర హెడ్ వై.కృష్ణ, అధికారులు, సత్ సంగ్ విద్యాలయ టీచర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam