DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*టిటిడి బోర్డు ట్రస్టీ  4 ఎకరాల భూమి, రూ 3.16 కోట్ల విరాళం*

*Srivari temple to be built at Ulundurpeta in Tamilnadu*

*తమిళనాడు ఉలుందుర్పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 07, 2021  (డి ఎన్ ఎస్):* తమిళనాడు రాష్ట్రం ఉలుందుర్పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ సభ్యులు

కుమారగురు తన నియోజకవర్గ ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడానికి 4 ఎకరాల స్థలం, నిర్మాణ ఖర్చులకు రూ 3.16 కోట్లు చెక్కులు విరాళంగా అందించారు. తిరుమల గుబ్బ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వీటిని అందించారు. ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలు, రూ 3.16

కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కులను  కుమారగురు అందజేశారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ధర్మ ప్రచారం : చైర్మన్

ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ధర్మ ప్రచారం చేస్తున్నామన్నారు. త్వరలోనే జమ్మూ

కాశ్మీర్ లో శ్రీవారి ఆలయానికి శంఖుస్థాపన చేస్తామన్నారు. కుమారగురు తన నియోజకవర్గ ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడానికి రూ 20 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఆలయ నిర్మాణానికి గతంలో కోటి విరాళం ఇచ్చారనీ, ప్రస్తుతం ఇచ్చిన చెక్కులతో కలిపి రూ 3 కోట్ల 16 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. ఆలయ

నిర్మాణానికి ఖర్చయ్యే మిగిలిన మొత్తం కూడా కుమార గురు విరాళంగా అందిస్తామని చెప్పడం సంతోషమని సుబ్బారెడ్డి చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam