DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కృష్ణ జిల్లా లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 08, 2021  (డి ఎన్ ఎస్):*  కృష్ణా జిల్లా నందిగామ వీరులపాడు  మండలం లోని పెద్దాపురం లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఆటో లో తెలంగాణ నుండి  అక్రమంగా తరలిస్తున్న 2840 మద్యం సీసాలు లభించాయి. ఆటోతో పాటు, ఇద్దరు వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వ్యక్తులను, మద్యం సీసాలతో సహా మీడీయా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. తొలి విడత తొమ్మిది మండలాల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టార్మని, మొత్తం 379 పోలింగ్ లొకేషన్లో 18 30

పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వీటిలో 130 సమస్యాత్మక 83 అత్యంత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లు ఉన్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు రెడ్ జోన్ ఆంక్షలు ఉంటాయన్నారు. 

ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పర్యటించి పరిస్థితులు

సమీక్షించినట్టు  జిల్లా ఎస్పీ తెలిపారు. తనిఖీలు ద్వారా ఒక కోటి 30 లక్షలు పైగా నగదు 20 గ్రాముల బంగారం ఇరవై మూడు కేజీల వెండి21 వేల 97 మద్యం బాటిల్ లు 1,682 నాటుసారా 630 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 60 వేల మూడు వందల 99 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామని, ఇప్పటికి నాలుగు వేల ఇరవై ఆరు మంది బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఒక

వెయ్యి 567 మందిపోలీస్ సిబ్బంది మరో ఒక వెయ్యి ఆరు వందల పదిహేను మంది ఇతర విభాగాల సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో 4 నమోదు చేశామని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam