DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*గ్రామ వాలంటీర్ లకు కనీస వేతనం రూ.12 వేలకు పెంచాలి*

కోవిడ్ లోనూ కష్టపడ్డాం, ఉద్యోగ భద్రతా ఇవ్వండి

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 08, 2021  (డి ఎన్ ఎస్):* గత 18 నెలలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లకు  కనీస వేతనం రూ. 12 వేలు గా పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో సోమవారం విశాఖ జిల్లా

కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నా ఈ నిరసనల్లో భాగంగా విశాఖ జిల్లాలోని గ్రామా / వార్డు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైనప్పటి నుండి వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైందని నాటి నుండి నేటి వరకు

కేవలం ఐదు వేల రూపాయలు వేతనంతో విధులు  నిర్వహిస్తున్నమన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా  వ్యవహరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాలంటీర్ వ్యవస్థ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తావని పేర్కొన్నారు.

అనంతరం జిల్లా కలక్టర్ కార్యాలయం లో అధికారులకు వినతి పత్రం అందజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam