DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గనులిస్తే. .స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రభుత్వమే కొంటుంది. 

*ట్విట్టర్ లో ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు* 

*చేతుల మార్పు కోసమేనా లేఖ వ్రాసింది: ప్రతిపక్షాలు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 09, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు

చేస్తే. . దాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలతో పెట్టుబడులను ఉపసరించుకుంటోందంటూ కేంద్రం చేసిన ప్రకటనలతో రాష్ట్రవ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం

ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై పునరాలోచించుకోవాలని, ప్లాంట్ కు సొంతగనులు కేటాయిస్తే. .రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్లాంట్ ను కొనుగోలు చేస్తుందంటూ లేఖ వ్రాసినట్టుగా విజయసాయి కామెంట్ చేసారు. 
ప్రస్తుతం దీనిపై ప్రతిపక్ష పార్టీలు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కొనుగోలు చేసేంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటె. .ఇంతకాలం రాష్ట్రంలోని పోలవరం, సహా ఇతర ప్రాజెక్ట్ లను ఎందుకు పూర్తి చేయలేదంటూ మండిపడుతున్నాయి. కేంద్రం చేతిలో ఉంటేనే ప్లాంట్ ఎటువంటి ఒడిడుకులు లేకుండా ఉంటుందని, రాష్ట్రం చేతిలోకి వస్తే. . ఇబ్బందులు తప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం

చేతిలోకి వెళ్లినా . . ప్రయివేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లినా ఒక్కటేనని మండిపడుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam