DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చెయ్యవద్దని కేంద్రాన్ని కోరాం: పవన్

*అమిత్ షా, ఆర్ధిక మంత్రులు, బీజేపీ నేతలతో జనసేనాని భేటీ*  

*జనసేనాని ఢిల్లీ పర్యటన సఫలీకృత ఫలితం ఇస్తోందా?*

*మార్చి 3 , 4 తేదీల్లో సంయుక్త కోర్ కమిటీ భేటీ: పవన్ కళ్యాణ్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 10, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ స్టీల్

ప్లాంట్ ప్రైవేట్ పరం చెయ్యకుండా సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు మరోమార్గాలు చూడాలని కేంద్ర పెద్దలను కలిసినట్టు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం లోని కీలక పెద్దలైన హోంశాఖ మంత్రి అమిత్ షా ను, ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ సహా ఇతరులను

ప్రత్యక్షంగా కలిసి స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ పరం కాకుండా చూడాలని కోరడం జరిగింది. ఈ భేటీల అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నా అన్ని సంఘటనలనూ అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లామన్నారు. శాంతిభద్రతలు, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, ప్రతిపక్ష పార్టీలపై

అక్రమంగా పెడుతున్న కేసులు, సోషల్ మీడియా వ్యాఖ్యలపై పోలీస్ కేసులు, సహా రానున్న తిరుపతి ఉప ఎన్నికల విషయమై చేపట్టవలసిన కార్యాచరణ తదితర అంశాలను చర్చించామన్నారు. 
ప్రయివేట్ పరం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటె. .. అదే విషయం ప్రధానికి వ్రాసిన లేఖలో స్పష్టంగా చెప్పాల్సివుండగా ముఖ్యమంత్రి పు న పరిశీలన

చెయ్యాలంటూ ఎందుకు లేఖవ్రాశారని పవన్ ప్రశ్నించారు.  

స్టీల్ ప్లాంట్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటె కేంద్రం తప్పకుండా ఒప్పేసుకునే అవకాశాలుంటాయన్నారు. 

మార్చి 3 న సంయుక్త భేటీ :.  .

రాష్ట్రంలో బీజేపీ - జనసేన సంయుక్తంగా చేపట్టవలసిన ప్రచార కార్యాచరణను మార్చి 3 ,4 తేదీల్లో

సంయుక్త కొర్ కమిటీ సమావేశం నిర్వహిద్దామని అమిత్ సూచించారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam