DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో కలిపే దిశగా సూచనలు. . .?

*జనసేనాని ఢిల్లీ పర్యటన సఫలీకృత ఫలితం ఇస్తోందా?*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 10, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో కలిపే దిశగా అడుగులు పడుతున్నట్టు సంకేతాలు తెలుస్తున్నాయి. దీనిపై ఇటు కేంద్రప్రభుత్వం గానీ, బీజేపీ గానీ, ఎటువంటి

ప్రకటన చెయ్యనప్పడికి అదే విధమైన సంకేతాలు వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బుధవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనే. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఇంతకూ ముందే అమిత్ షా, ఆర్ధిక మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ ను యధాతదంగానే కొనసాగించాలని కోరడం జరిగింది. అయితే వారికి ఎటువంటి

హామీ ఇవ్వని కేంద్ర మంత్రులు, జనసేనాని బృందం తో చర్చల అనంతరం కొంత భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆర్ధిక సమస్యల కారణంగానే ప్రైవేట్ పరం చెయ్యాలనే ఆలోచనకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడవలసిందిగా పవన్ కోరడం గమనార్హం. 
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ - జనసేన పార్టీలు సంయుక్తంగా నడిచేందుకు సిద్ధంగా ఉన్నందున, కేంద్ర

ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వ్యవహారం లో సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ రెండు పోటీలకు కొంత కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికలు, ఆపై మునిసిపల్ ఎన్నికలు జరగనున్నందున ఈ ఘటనతో కొంత లాభంపొందాలి అనే రాజకీయ ఆలోచన కూడా లేకపోలేదని వార్తలు వినపడుతున్నాయి. 
ప్రస్తుతం ఈ విపత్కర సమస్య సత్వర, శాశ్వత

నిర్ణయం లాభాల్లో ఉన్న సంస్థతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కలపడం ఒక్కటే. దీనికి తగిన పరిష్కారం స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా ( సెయిల్) దీనికి గనులు, ఇతర మౌలిక వనరులు ఉన్నాయి, అయితే ఆ ముడిసరుకుని వినియోగించుకునే మార్గం కోసం ప్రయత్నాల్లో ఉంది. ఈ రెంటినీ కలిపితే. . సెయిల్ నుంచి వచ్చే గనులను వినియోగించుకుని అత్యుత్తమ ఉత్పత్తులను

విడుదల చేసే అవకాశం ఉంది. 
కేంద్రం లోని పెద్దలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన బృందం ఢిల్లీ పర్యటన కూడా జరగడం ఇరు పార్టీలకు కలిసి వచ్చే అవకాశం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam