DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాగ్యనగరం మేయర్ గా కేకే కూతురు విజయలక్ష్మి ఎన్నిక 

*డిప్యూటీ మేయర్ గా  శ్రీలతరెడ్డి, టిఆర్ఎస్ కు ఎంఐఎం తోడు*   

*తెరవెనుక భాగోతం బల్దియా లో బయటపడింది: బీజేపీ*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 11, 2021  (డి ఎన్ ఎస్):* భాగ్యనగరం నూతన మేయర్ గా రాజ్యసభ సభ్యులు కె. కేశవ రావు కుమార్తె గద్వాల్

విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గురువారం జిహెచ్ఎంసి సమావేశం లో జరిగిన మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారిగా ఎన్నికైన విజయలక్ష్మి పేరు ప్రకటించగానే, ఎంఐఎం బేషరతు మద్దతు ఇచ్చింది. దీంతో పూర్తి మెజారిటీ తో ఆమె ఎన్నికైనట్టు ప్రకటించారు. డిప్యూటీ మేయర్ గా తార్నాక డివిజన్ నుంచి

కార్పొరేటర్ గా గెలిచినా మోతే శ్రీలతరెడ్డి అదే మెజారిటీ తో ఎన్నికయ్యారు. అయితే ఎంఐఎం విప్ జారీ చేయడంతో వీళ్ళ అభ్యర్థులు కూడా ఉంటారని తెలిసింది. ఒక్కసారిగా సమావేశం హాల్లోకి రాగానే ఎంఐఎం బేషరతుగా టి ఆర్ ఎస్ కు మద్దతు ప్రకటించింది. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించారు. దీంతో భారతీయ జనతా

పార్టీ వీళ్లిద్దరి తెరవెనుక భాగోతం బయట పడిందని మండిపడింది. బీజేపీ అభ్యర్థులను నిలబెట్టినా ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ రెండు ముఖ్యమైన పదవులను కైవసం చేసుకుంది.

గద్వాల విజయలక్ష్మి రెండు సార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఈమె తండ్రి కేకే రాజకీయ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసినప్పడికి ఈమె తనకంటూ

ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈమె భర్త పేరు బాబి రెడ్డి, 18 ఏళ్ల పాటు అమెరికాలో రిసర్చ్ అసిస్టెంట్ గా పని చేసారు. 2007 లో అమెరికా పౌరసత్వం వదులుకొని ఇండియాకి వచ్చిన విజయలక్ష్మి తండ్రి కేకే వారుసురాలుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2016 లో  బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి తొలిసారి కార్పొరేటర్ గా గెలిచిన విజయలక్ష్మి ప్రజా

సమస్యల పైన దూకుడుగా వ్యవహరించే నేతగా పేరు ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam