DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరిబాబు గారూ బీజేపీ వీడి రండి, రైల్వే జోన్ కోసం పోరాడదాం -మంత్రి గంటా

విశాఖపట్నం, జులై 22, 2018 (DNS Online ) : విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం, నిబంధనలు అడ్డం వస్తే భారతీయ జనతా పార్టీ ని వదిలి బయటకు

రావాలని ఎంపీ హరిబాబు కు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ

గత ఎన్నికల్లో రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచామని, దాని నిలబెట్టుకోవాల్సిన నైతిక భాద్యత మీ పైనే ఉందన్నారు. నాలుగేళ్లు దాటినా తర్వాత కూడా

ఇంకా చూస్తాం చేస్తాం అంటే మీ నైతిక భాద్యత కు నిదర్శనం గా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న నిరసనలకు సంఘీభావాన్ని పాటించాల్సిన

అవసరం ఉందన్నారు. మీకు పార్టీ ప్రయోజనాల కంటే ముందు రాష్ట్ర ప్రజల మనోభావాలు ముఖ్యమన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam