DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ కోసం 28 ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పాలి

*విజయసాయి ని విశాఖ నుంచి తరిమికొట్టాలని పిలుపు*

*ఉక్కు భూములు రియల్ ఎస్టేట్ చెయ్యడానికి విజయసాయి కుట్ర* 

*వైకాపా చిత్తశుద్ధి పై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 11, 2021  (డి ఎన్ ఎస్):* అధికార

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి విశాఖ స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉంటె. . . 28 ఎంపీలు రాజీనామా చేస్తామని కేంద్రానికి లేఖ వ్రాయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న సవాల్ విసిరారు. గురువారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయడం విడ్డురం గా ఉందని, ఈ విషయం జగన్ రెడ్డి కి

తెలుసు ఈడీల్ లో జగన్ పాత్ర ఉందన్నారు. ఈ డీల్ వాళ్లే కుదర్చారన్నారు. 2019 లో సీఎం అవ్వగానే జనాగ్ పోస్కో తో కలిసింది వాస్తవమే కదా, 2020 లో కూడా పోస్కో వాళ్ళతో కలిశారన్నారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందని అన్నారు. 3 రాజధానులు నాటకం ఆడి ఉత్తరాంధ్రలో భూ సర్వే చేసుకున్నారని మండిపడ్డారు. 
విజయసాయి

రెడ్డి కి ఉత్తరాంధ్ర లో ఏమి పని అని, ఆతను వచ్చిన చోట బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. ఇక్కడికి వచ్చాడు, విశాఖ ను నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆస్తులు ఆక్రమణ చేయడానికి విశాఖ లో ఉంటున్నారని, 2 లక్షల కోట్ల విలువ చేసే భూముల మీద కన్ను పడింది..అందుకే మాట్లాడటం లేదన్నారు. తక్షణం విజయసాయి ని విశాఖ నుంచి తెరిమికొట్టాలని

పిలుపునించారు. 

ఉక్కు భూములు కొట్టెయ్యడానికే కుట్ర. . 

కోట్లాది రూపాయల విలువ చేసే ఉక్కు పరిశ్రమ కి చెందిన విలువైన భూములు కొట్టేయడానికి విజయ్ సాయి రెడ్డి కుట్ర అని వెంకన్న అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం వేలాది మంది ప్రజలు దానం చేసిన భూములను ఇతను రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోడానికే ఈ కుట్ర

అన్నారు. 

ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు  

వైకాపా ప్రభుత్వం చేసే తప్పుడు పనుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకు పంపడం ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా మార్చేశారన్నారు. గత మూడు రోజులుగా తానూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని, తనని కూడా జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. తానూ జైలుకి

వెళ్ళడానికి సిద్ధం అన్నారు. 

రాష్ట్రంలో పోలీసులకి విలువలేకుండా చేశారన్నారు. గతంలో ఒక కానిస్టేబుల్ ను చూస్తే పెద్దలు సైతం గౌరవంగా చూసేవారని, ప్రస్తుతం ప్రభుత్వ పాలనా ప్రభావం కారణంగా అత్యున్నత పొలిసు అధికారి డిజిపి కి కూడా సామాన్యులు విలువ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అయితే తమకు పొలిసు వ్యవస్థ పై ఎంతో

గౌరవం ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam