DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై డిఐజి వీడియో భేటీ. 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 11, 2021  (డి ఎన్ ఎస్):* ఈనెల 13 న జరుగనున్న 2 వ దశ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణ జిల్లా పోలీస్  అధికారులు, మహిళా పోలీస్ అధికారులతో ఏలూరు నుంచి ఏలూరు డిఐజి కెవి మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.  ఈ వీడియో

కాన్ఫరెన్స్ లో డీఐజీ మాట్లాడుతూ మొదటి దశ పంచాయతీ ఎన్నికల జరిగిన ఈ విషయంలో అధికారులు అందరూ కష్టపడి ఏ విధమైన సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహణలో వారి యొక్క బాధ్యతలను నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. రెండవ దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు అందరూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలలో ఉన్న

గ్రామాలలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ రూల్స్ ను గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. 
అంతర రాష్ట్ర అంతర జిల్లా లలో  నుండి మద్యం అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి  నిరంతరం నిఘా కొనసాగించాలని పంచాయతీ ఎన్నికలు సందర్భంగా ప్రజలు నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రతి

పోలీస్ అధికారి బారోసా కల్పించాలన్నారు. ప్రజలతో అధికారులు  ఎప్పటికప్పుడు చర్చిస్తూ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో  పోలింగ్ స్టేషన్, కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతులు లేని వారిని అనుమతించరాదని తెలిపారు. 
ప్రతి పంచాయతీ లలో  ప్రశాంత వాతావరణంలో పోలింగ్  ముందు రోజు నా పోలింగ్ రోజునాడు పోలింగ్

తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీ లు చేపట్టకుండా, బాణ సంచా కాల్చకుండ చర్యలు తీసుకోవాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు పోలీసు అధికారులు తీసుకొంటున్న చర్యలకు సహకరించి కరోనా వైరస్ బారిన పడకుండా చూడాలని అధికారులకు

తగిన సూచనలు సలహాలను అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam