DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రింకు శర్మ ను బలిగొన్న మతోన్మాదులను ఉరి తియ్యాలి

*జై శ్రీరామ్ అంటే ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తారా?:* 

*ఢిల్లీ లో ఉగ్రవాద మతోన్మాదులు పేట్రేగిపోతున్నారు* 

*భార్యకు రక్తదానం చేసిన వారినే బహిరంగంగా చంపేశాడు*

*విశాఖ విహెచ్పి సం. కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపాటు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2021  (డి ఎన్ ఎస్):* అయోధ్య రామతీర్థ క్షేత్ర నిధి సమర్పణ కోసం ఢిల్లీలో ప్రచారం చేస్తున్న 26 ఏళ్ళ రింకు శర్మ ను ఇంట్లోకి చొరబడి మరీ చంపిన మతోన్మాద హతకులను ఉరితీయాలని విశ్వ హిందూ పరిషత్ విశాఖ ప్రాంత సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ డిమాండ్ చేసారు. జై శ్రీరామ్ అంటూ మందిర నిర్మాణ విరాళ

సేకరణలో ప్రచారం చేస్తున్న రింకు శర్మ భజరంగ్ దళ్ కార్యకర్త. ఈనెల 10 వ తేదీన రాత్రి ఇతని ఇంట్లోకి సుమారు 25 మంది చొరబడి రింకు శర్మ ను ఈడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రుల కళ్ళ ముందే మర్డర్ చేశారన్నారు. ఈ ఘటన పూర్తి ఉగ్రవాద మతోన్మాద శక్తుల పని అన్నారు. వీళ్లల్లో నలుగురు ప్రత్యక్షంగా హత్యచేయడం జరిగిందన్నారు.  

 ఈ

ఘటనపై స్పందించడానికి సైతం రాజకీయ నేతలకు, మానవ హక్కుల సంఘాలకు, మీడియా కు నోరు రావడం లేదన్నారు. ఇతను జై శ్రీరామ్ అనడమే ఇతను చేసిన తప్పిదమని, ఇది నచ్చని హిందూ వ్యతిరేక శక్తులు (ముస్లిం వర్గం)  ఇతని ఇంటిపై దాడి చేసి, ఇతన్ని అత్యంత పాశవికంగా చంపేశారన్నారు. వీళ్ళలో మొహమ్మద్ ఇస్లాం, డేనిష్  నస్రుద్దీన్, దిల్షాన్ ,

దిల్షాద్ ఇస్లాం లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. 
 
రక్తదాతనే బలిగొన్నాడు...

రింకు శర్మ ను చంపిన నలుగురిలో ఒకతని భార్యకి రక్తం ఎక్కించాలంటే శర్మ రెండుసార్లు రక్తదానం చేశాడన్నారు. కనీసం కృతజ్ఞత కూడా లేకుండా అత్యంత పాశవికంగా పొడిచి మరీ చంపాడన్నారు. 

ఈ ఘటనను

ఖండించిన నాధుడే లేదన్నారు. కేవలం ఇతను హిందువు, పైగా ఒక బ్రాహ్మణుడు కావడమే ఈ దేశంలో దౌర్భాగ్యంగా మారిందన్నారు. దీన్ని ఖండించేందుకు కూడా ఒక్కడు ముందుకు రాలేదన్నారు. 

ఈ దేశంలో సెక్యులర్ అనేది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వాలు సైతం ఓట్ల కోసం మైనారిటీలు చేస్తున్న దురాగతాలకు కొమ్ము

కాస్తున్నారని అనడానికి ఢిల్లీలోని రికీ శర్మ ఉదంతమే నిదర్శనం అన్నారు. ఈ ఘటనకు ఢిల్లీ లోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. 

ఈ దేశంలో జై శ్రీరాం అనడం పాపం అని,హిందువులకి ఆ హక్కు లేదని సెక్యూలరిజం పేరిట మైనారిటీ ల ఓట్లకోసం లేకి పార్టీలు చిమ్ముతున్న విషం, వాళ్లకు మద్దతుగా వాళ్ళనే

సమర్ధిస్తున్న మీడియా.. ఆ తల్లి కడుపు కోతకు ఎవరు బాధ్యత వహిస్తారు ? అని ప్రశ్నించారు. 

అయితే. .. ఈ ఘటన మతపరమైన నేపథ్యంలో జరగలేదని, కేవలం ఇద్దరి మధ్య ఉన్న వ్యాపార లావాదేవీల వాళ్ళ జరిగిందని, పోలీసులు మతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam