DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 14 అనగానే గుర్తుకు రావాలింది పుల్వామా దుర్ఘటనే

*ప్రేమికుల దినం కాదు. .సైనికుల త్యాగాలు గుర్తుకు రావలి.*

*40 మంది సైనికులపై ముష్కరుల దొంగదెబ్బ తీసింది ఈరోజే. .   

*దేశ రక్షణ విధులకు వెళ్తున్న సైనిక వాహనాలపై బాంబులదాడి*

*ఉగ్రమూకలపై నరేంద్రుని ఉక్కుపాదం. .సైన్యానికి ధైర్యం.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 13, 2021  (డి ఎన్ ఎస్):* 14 ఫిబ్రవరి. . పేరు చెప్పగానే యావత్ భారత దేశ ప్రజలందరి హృదయం ద్రవించిపోతుంది. ఇదే రోజున 2019 న, జమ్మూ నుండి శ్రీనగర్ వరకు 2,500 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బంది వెళ్తున్న వాహనాలపై పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్

ఉగ్రవాద ముష్కరులు దొంగదెబ్బ తీసి, బాంబు ప్రేల్లుళ్ళు జరిపారు. ఈ ఘటన లో 76 వ బెటాలియన్ కు  చెందిన 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. 

ఫిబ్రవరి 14 అంటే వాలెంటైన్ దినం కాదు. .సైనికుల త్యాగం.

పాశ్చాత్య విశృంఖల, నిస్సిగ్గు పోకడలను, బహిరంగ విచ్చలవిడి శృంగారాన్ని  భారత దేశంలోకూడా అలవాటు చేసిన

సంస్థల కారణంగా ఫిబ్రవరి 14 అనగానే యువత ప్రేమికుల దినం గా మాత్రమే భావించి, బహిరంగ శృంగారానికి అలవాటు పడిపోయేలా చేశాయి. దేశ భక్తి పెంపొందించేలా ప్రధాని మోడీ అమలు చేస్తున్న కార్యాచరణ మింగుడు పడని దుష్ట శక్తులు, విదేశీ విద్రోహ ఉగ్రవాద శక్తులు తిరుగుబాటు చర్యలకు దిగుతున్నారు. దీనికి నిదర్శనంగానే పుల్వామా

ఘటన. 

ఈ రోజున యావత్ భారత దేశ ప్రజలందరికీ గుర్తు రావాల్సింది భారత సైనికుల ప్రాణత్యాగమే తప్ప. . . విద్రోహ శక్తుల వాలెంటైన్ దినం కాదు అనే సందేశంతో ప్రస్తుత యువత క్యాంపైన్ సైతం నిర్వహిస్తున్నారు.     

ఘటన జరిగిన వైనం:. . . 

 ఈ సమయంలో రవాణా చేస్తున్న 78 వాహనాల కాన్వాయ్ జాతీయ రహదారి 44 లో

ప్రయాణిస్తున్నది. కాన్వాయ్ జమ్మూ నుండి బయలుదేరింది. మధ్యాహ్నం 03:30 గంటల సమయంలో రెండు రోజుల ముందు హైవే మూసివేయబడినందున పెద్ద సంఖ్యలో సిబ్బంది  కాన్వాయ్ సూర్యాస్తమయానికి ముందే దాని గమ్యాన్ని చేరుకోవలసి ఉంది. 

అవంటిపోరా సమీపంలోని లెత్‌పోరా వద్ద, మధ్యాహ్నం 15:15 గంటల సమయంలో, భద్రతా సిబ్బందితో వెళుతున్న

బస్సులకు మధ్యలో ఉగ్రవాదుల కారు చేరింది, ఈ విషయం తెలియని సైనికుల కాన్వాయ్ లోని ఒక బస్సు పేలుడు పదార్థాలతో వెళుతున్న కారును  ఢీ కొట్టింది. 

ఇది 76 వ బెటాలియన్ కు  చెందిన 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని చంపి అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి

తరలించారు. 

పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి బాధ్యత వహించినట్టు ప్రకటించింది. దుండగుడు ఆదిల్ అహ్మద్ దార్ యొక్క వీడియోను కూడా వారు విడుదల చేశారు, ఒక సంవత్సరం ముందు ఈ బృందంలో చేరిన కాకాపోరాకు చెందిన 22 ఏళ్ల. . .దార్ కుటుంబం అతనిని చివరిసారిగా మార్చి 2018 లో చూసింది, అతను ఒక రోజు తన ఇంటిని

సైకిల్‌పై వదిలిపెట్టి తిరిగి రాలేదు. జైష్-ఇ-మొహమ్మద్ నాయకుడు మసూద్ అజార్ దేశంలో పనిచేస్తున్నట్లు తెలిసినప్పటికీ, పాకిస్తాన్ ఎటువంటి ప్రమేయాన్ని ఖండించలేదు. 

ఉగ్రమూకలపై నరేంద్రుని ఉక్కుపాదం. .సైన్యానికి ధైర్యం. 

పాక్ ప్రేరిత ఉగ్రవాదుల చర్యలను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రధాని

నరేంద్ర మోడీ ఉక్కుపాదం మోపే చర్యలను చేపట్టారు. దీనిలో భాగంగానే కాశ్మీర్ లోని పాక్ ప్రేరిత ఉగ్రసంస్థల ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాశ్మీర్ లోని ప్రత్యేక చట్టాలను ఆర్టికల్ 370 ని పూర్తిగా రద్దు చేస్తూ. . కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసారు. దీంతో భారత సైన్యానికి గట్టి భద్రతా ఏర్పడింది. అంతకు ముందు

భారత్ సైన్యం పై కాశ్మీర్ లోని ఉగ్రవాదులు రాళ్లదాడులు కురిపించినా నోరెత్తే పరిస్థితి ఉండేది కాదు. అయితే మోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా అదే ప్రాంతంలో భారత సైన్యం ధైర్యంగా దేశ రక్షణ చెయ్యగలుగుతోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam