DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవిశ్వాసం ఓడినా . . . నైతికంగా గెలిచాం : మంత్రి గంటా . 

విశాఖపట్నం, జులై 22, 2018 (DNS Online ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, విభజన చట్టంలో పెట్టిన విషయాలను అమలు చెయ్యని బీజేపీ పై తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం లో అంకెల

గారడీ లో ఓడినా, నైతికంగా గెలిచామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ  à°Žà°¨à±à°¨à°¿à°•à°² ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చని భారతీయ జనతా పార్టీకి కూడా à°—à°¤ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ à°•à°¿ పట్టిన గతే పడుతుందన్నారు. విభజన లో అన్ని

రకాలుగా నష్ట పోయిన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని సాక్షాత్తు నరేంద్ర మోడీ ( ప్రధాని అభ్యర్థిగా) హామీ ఇచ్చి, ప్రధాని మంత్రి గా దాన్ని తుంగలోకి

తొక్కారన్నారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు కేవలం తమ పార్టీ పలుకులనే పలుకుతున్నారని, అయితే అందరికీ పార్టీ లకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రైల్వే జోన్

విషయం మరిచిపోయారని, బులెట్ ట్రైన్ కి ఇచ్చిన ప్రాధాన్యత విశాఖ రైల్వే జోన్ కి ఇవ్వలేదని, రాష్ట్రానికి ప్రకటించిన జాతీయ విద్య సంస్థలు కేవలం తాత్కాలిక

కేంద్రాల్లోనే ఇంకా నడుస్తున్నాయన్నారు. వాటిల్లో ప్రధానమైనవి ఐ ఐ ఎం, పెట్రోలియం యూనివర్సిటీలు ఆతీ గతీ లేదన్నారు. దీనికి నిదర్శనమే ... కేవలం ఒక స్టేట్

యూనివర్సిటీ అయినా ఆంధ్ర విశ్వ విద్యాలయం లోనే  à°¦à±‡à°¶à°‚ లోనే అత్యంత ప్రాధాన్యత కల్గిన ఐ ఐ à°Žà°‚, పెట్రోలియం యూనివర్సిటీలు  à°’à°• గదిలో నడుస్తున్నాయంటే కేంద్రానికి

ఆంధ్రా మీద ఏ విధమైన శ్రద్ధ ఉందొ తెలుస్తోందన్నారు. వీటికి కనీసం నిధులు కేటాయించలేదని, ప్రస్తుతం ఉన్న తరగతి గదులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినవేనన్నారు. ఈ

విధమైన ముఖ్యమైన విషయాలను శుక్రవారం పార్లమెంట్ లో జరిగిన అవిశ్వాస తీర్మానం లో కేంద్ర మంత్రులు సహా, ఈ హామీలు ఇచ్చిన దేశ ప్రధాన మంత్రి కనీసం ఒక్క నిమిషం పాటు

కూడా మాట్లాడక పోవడం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను అవమానించడమేనన్నారు. 

ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి కి మోడీ వైఖరే కారణం.

దేశం మొత్తం లో జరిగిన ఉప

ఎన్నికల్లో అన్నింటా అధికార బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ వైఖరే కారణమని à°—à°‚à°Ÿà°¾ అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక 11  à°Žà°‚పీ à°² ఉప ఎన్నికలో

ఓడిపోయారు, యుపిలో 2  à°Žà°‚పీ సీట్లు ఓడిపోయారు. దీనిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్ సీటు కూడా బీజేపీ కోల్పోయిందన్నారు. ఇన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయినా దేశం లో

మాకు ఆదరణ ఉంది అని చెప్పుకోవడం కేవలం మోడీ కె చెల్లిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి కనీసం డిపాజిట్లు కూడా వచ్చే

పరిస్థితి లేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam