DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది?

*ప్రజా వేదన పట్టని సీఎం రేపు వాళ్ళ స్వామి దగ్గరకి వస్తున్నాడు*

*జగన్ పాలనపై విశాఖలో చంద్రబాబు మండిపాటు.* 

*రాష్ట్రప్రజలకు ఉపయోగం లేని పాదయాత్రలు ఎందుకు*  

*పల్లా శ్రీనివాసరావుది దొంగ దీక్ష కాదు.. పది కేజీలు తగ్గాడు.*

*స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా నిలబడతాం:

చంద్రబాబు.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రతిపక్ష నేత తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు విశాఖలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో గత

ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావు హాస్పిటల్లో ఆయన పలకరించారు అనంతరం ఆసుపత్రి వెలుపల ఏర్పాటు చేసిన బహిరంగ సభలోను, తదుపరి నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని  దోచుకోవాలని అనుకుంటున్నారా, అని ప్రశ్నించారు.  విశాఖ ఆత్మ అంటే  స్టీల్ ప్లాంట్ అని

ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎందరో ప్రాణ త్యాగాల తో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని గుర్తు చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంటు జగన్ మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో 150 దేవాలయాలు, దేవీదేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తే కనీసం ఏ ఒక్క చోటకి కూడా రావడానికి ఖాళీ లేని ఈ *ప్రజా వేదన పట్టని సీఎం

రేపు విశాఖలోని వాళ్ళ స్వామి ని చూసేందుకు వస్తున్నాడని అంటూ ఆయన పరోక్షంగా పెందుర్తి లో ఓ స్వామి పై ఎద్దేవా చేశారు. అధికారం లో ఉన్నవాళ్లు కేంద్రంతో పోరాడైనా ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా ఆపాలి తప్ప, పాదయాత్రలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తే నవ్విపోతారన్నారు. ఎవరికి కావాలి మీ పాదయాత్రలు అంటూ

ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేని పాదయాత్రలు ఎందుకని, విజయసారి రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేసారు. ఈ నెల 22 న విశాఖలో పాదయాత్ర చేస్తున్నట్టు మంగళవారం విజయసాయి ప్రకటించిన విషయం తెలిసిందే.  

పల్లా శ్రీనివాసరావుది దొంగ దీక్ష కాదు: . .

గాజువాక మాజీ ఎమ్మెల్యే - పల్లా శ్రీనివాసరావు

నిస్వార్ధంగా దీక్షకు దిగారని, అతని దీక్షను దొంగ దీక్ష అంటూ ఎద్దేవా చేసేవాడు కనీసం ఒక్కరోజైనా దీక్ష చేయాలన్నారు. వైద్యులతో మాట్లాడాం, పల్లా పది కేజీలు బరువు తగ్గాడన్నారు. ఉద్యమ స్ఫూర్తి తెలియని వాళ్ళు నోటికి వాచినట్టు ఏదైనా మాట్లాడతారన్నారు. వాళ్ళల్లా తమకు బూతులు తిట్టడం రాదన్నారు. 

విశాఖ స్టీల్

ప్లాంట్ పరోక్షంగా 5 లక్షల మందికి ఆదాయాన్ని ఇస్తుందన్నారు. విశాఖలో  మెట్రోకు శ్రీకారం చుట్టింది తానే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని ప్రశ్నించారు. మీరు పాలకుల కమీషన్ ఏజెంట్లు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం  ఏం చేసింది

అని ప్రశ్నించారు. ప్లాంట్ లేకపోతే విశాఖ లేదన్నారు విశాఖ ఉద్యమానికి ఊపిరి పోస్తుంటే వైఎస్సార్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగారు ఎక్కడున్నారు సీఎం గారు పబ్జి ఆడుతున్నారా అని ఎద్దేవా చేశారు. బాబాయ్ వివేకానంద రెడ్డి ని హత్య చేసి ఏమీ తెలియకపోయినట్లు నటిస్తున్న మహామేధావి ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్మోహన్ రెడ్డి అని

 ఎద్దేవా చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam