DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవీఎంసీ నూతన కమిషనర్ గా ఎస్. నాగలక్ష్మి నియామకం. 

*గత రెండురోజుల నుంచి సెలవు పై వెళ్లిన డా. సృజన* 

*ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసి సూచనలతోనే బదిలీ*

*కరోనా కాలంలోనే బాలింతగా ఉన్నా.. విధి నిర్వహణలోనే సృజన*  

 *(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* మహా విశాఖనగరపాలక సంస్థ

ఎన్నికల నేపథ్యంలో జివిఎంసి నూతన కమిషనర్ గా ఎస్. నాగలక్ష్మి ని నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాగలక్ష్మి సెల్వరాజన్ (2012 బ్యాచ్)ను ప్రస్తుతం విశాఖపట్నంలోనే ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొ

న్నారు

ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న డా. గుమ్మళ్ల సృజన (2013 బ్యాచ్) ను గాత రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలపై సెలవులో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి బదిలీ చేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయి సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని సృజన ను

ఆదేశించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం సృజన విధులను సమర్థవంతంగా నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. గత ఏడాది కరోనా కష్టకాలం లో ఉన్న సమయంలో ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. ముందు రోజు వరకూ ఆమె వీధుల్లోనే ఉండడం గమనార్హం. తదుపరి కేవలం రెండు వారాల విరామం తదుపరి తిరిగి విధుల్లోకి రావడం గమనార్హం. అయితే కొన్ని

వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారు. 

జీవీఎంసీ ఎన్నికలు ప్రకటిస్తున్న తరుణంలో స్పజన నెల రోజులు సెలవు కావాలని కోరడం, వెంటనే ప్రభుత్వం ఆమోదించడం అనేక అనుమా నాలకు తావిచ్చింది. ఆమె స్థానంలో వీఎంఆర్‌డిఏ కమిషనర్ కోటేశ్వరరావుకు ప్రభుత్వం ఇన్దార్జి బాధ్యతలు అప్పగిం చింది. ఈ నేపథ్యంలో

ఎన్నికల సంఘం విశాఖపట్నం కమిషనర్ గా నాగలక్ష్మిని ఎంపిక చేసి, ఆమెను నియమించా లని సూచించింది. దాంతో ప్రభుత్వం మంగళవారం ఉత్తరులు జారీచేసింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam