DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం విశాఖ పర్యటన, ముందస్తుగా పలువురు అరెస్ట్

*టీడీపీ, వామ పక్షాల నేతలు, ఎన్నికల్లో రెబెల్స్ కూడా అరెస్ట్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురిని అరెస్ట్ చేసారు.

వీరిలో వామ పక్షాల నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ గా జివిఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. విశాఖలోని ఓ పీట వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు అయన బుధవారం విశాఖ కు రానున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతాల్లో పీటానికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

విశాఖ పర్యటన సందర్భంగా సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షులు ఏ కె ఎస్ వి కుమార్ ను బుధవారం ఉదయం ఎంవిపి కోలని పోలీసులు గృహ నిర్బంధం చేసారు. ఎంవిపి కోలని లోని పోలీస్ స్టేషన్ కు రావాలని వత్తిడి చేసి, తరలించారు. పెందుర్తి సీఐటీయూ కార్యదర్శి జి.అప్పలరాజు ను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. ఇటీవల తాడేపల్లి లోని సీఎం కాంప్

కార్యాలయం వద్ద హడావిడి చేసిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంవిపి కోలని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నగర పాలక ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో అధికార పార్టీ కి రెబల్ గా బరిలో నిలిచిన విల్లూరి భాస్కర రావు ను కూడా పోలీసులు ముందస్తు చర్యగా

అరెస్ట్ చేయడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam