DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శారదాపీఠంలో పార్టీ పరివార సహితంగా సీఎం జగన్ పూజలు 

*ఖాకీల మయంగా కాషాయ పీఠం, కేవలం పార్టీ పరివారానికి అనుమతి.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం శివారు ప్రాంతంలోని చినముషిడివాడలో గల శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పార్టీ పరివార సహితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్

 జగన్మోహన్ రెడ్డి  బుధవారం పాల్గొని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరివార సహితంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అదే ప్రాంగణంలో ఉన్నసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి, దాసాంజనేయ స్వామి  ఆలయాల సందర్శించి ప్రత్యేక

పూజలు నిర్వహించారు. అనంతరం రాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు.  రాజ శ్యామల యాగం విశిష్టతను పీఠాధిపతులు, అపరశంకరులుగా పిలువబడే. . . స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి లు సీఎం జగన్ కు తెలియజేశారు. పీఠంలో సుమారు గంటసేపు గడిపారు. 
ఈ కార్యక్రమంలో  సీఎం జగన్ పీఠం లోనే

అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు పీఠంలో నిర్వహించే కార్యక్రమాల గురించి సీఎం జగన్ కు శారదా పీఠాధిపతి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం విశాఖ శ్రీ శారదాపీఠం వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. వేద పండితులకు సీఎం జగన్ చేతులమీదుగా సత్కారం జరిగింది. 
ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం రావడంతో అత్యంత కుగ్రామంగా

చినముషిడివాడ ఖాకీల మయంగా మారింది. సాధారణ రోజుల్లో పట్టపగలే పీఠంలో ఒక మనిషి కూడా కనపడే అవకాశం లేదు, బుధవారం మొత్తం పోలీసులు, పార్టీ పరివారాలు, కమాండో సెక్యూరిటీ ఇలా మొత్తం మనిషి అడుగు పెట్టేందుకు అవకాశం కూడా లేనట్టుగా తయారయ్యింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam