DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మేజర్ జనరల్ వేణుగోపాల్ కు సీఎం జగన్ ఘన సత్కారం

*స్వర్ణిమ్ విజయ్ మషాల్ లో భాగంగా సైనిక వీరులకు సత్కారం* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 18, 2021  (డి ఎన్ ఎస్):* స్వర్ణిమ్ విజయ్ వేడుకల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి కి చెందిన పరమ్ విశిష్ట సేవ మెడల్, మహావీర్ చక్ర అవార్డుల గ్రహీత ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ

వేణుగోపాల్‌ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారత ప్రభుత్వం తరపున సత్కరించారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న సైనిక వీరులను సత్కరించే కార్యక్రమమే ఈ వేడుకలు. గురువారం తిరుపతి లోని వేణుగోపాల రావు ఇంట్లో జరిగిన కార్యక్రమం లో వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన స్వర్ణోత్సవ కాగడాను వేణుగోపాల్ కు

అందించారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించి భారత ప్రభుత్వం అందించిన పురస్కారాన్ని అందచేశారు. ఈ సందర్బంగా నాటి ఘటనలను వేణుగోపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈయన స్ఫూర్తిగా నేటి యువత దేశ సేవలో తరించారన్నారు.        

సాయంత్రం ఆర్మీ అధికారులు తిరుపతి లోని పోలీస్ పరేడ్ మైదానం లో జరిగిన కార్యక్రమంలో సైనిక

అధికారులు 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన అంశాలను తెలియచేసారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ కాగడా, నాటి యుద్ధం లో పాల్గొన్న సైనికులు ఉన్న ప్రతి ప్రాంతానికి తిరుగుతూ వారిని సత్కరిస్తూ నేటి తరానికి స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తిరుపతి లోని వేణుగోపాల్ ఇంటి నుంచి మట్టి ని తీసుకు వెళ్లి, ఢిల్లీ లోని సైనిక స్మారక

కేంద్రంలో ప్రతిష్ట చేస్తారన్నారు.  

స్వర్ణిమ్ విజయ్ మషాల్:. . .

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం చోటు చేసుకుని 50 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వర్ణిమ్ విజయ్ మషాల్ పేరుతో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన

కాగడాను వెలిగించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు ఉన్న ప్రాంతాలకు ఈ కాగడాను తీసుకెళ్తారు. ఆ ఈ కాగడా తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెడుతోంది. తిరుపతితో దక్షిణాది దాని ప్రయాణం ఆరంభం అయ్యింది.

మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ : . . .

పరమ్ విశిష్ట సేవ మెడల్,

మహావీర్ చక్ర అవార్డుల గ్రహీత ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ 1927 లో తిరుపతి లో జన్మించారు.  5 /1  గోర్ఖ బెటాలియన్ లో విధులు నిర్వహించారు. 1950 లో సైన్యం చేరి, 1985 లో పదవి విరమణ చేశారు. 1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం లో లెఫ్టనెంట్ కల్నల్ హోదాలో పాల్గొన్నారు. 
ఈస్టర్ సెక్టార్ యొక్క జెస్సోర్ ప్రాంతంలో

మోహరించిన 5/1 గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్కు నాయకత్వం వహించారు. ఈ బెటాలియన్ 4 డిసెంబర్ 1971 న, ఉతాలి మరియు దర్సానాలో బాగా బలవర్థకమైన పాకిస్తాన్ స్థానాలను ఎదుర్కొంది. దీనిలో విస్తృతమైన కమ్యూనికేషన్ కందకాలతో అనుసంధానించబడిన కాంక్రీట్ పిల్‌బాక్స్‌లు ఉన్నాయి.

లెఫ్టినెంట్ కల్నల్ వేణుగోపాల్ ఒక ఖచ్చితమైన దాడి

ప్రణాళికను వేశాడు మరియు తన భద్రత గురించి పట్టించుకోకుండా వ్యక్తిగతంగా దాడికి నాయకత్వం వహించాడు. 

రెండు స్థానాలను స్వాధీనం చేసుకున్న తరువాత, 5/1 గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ ఉపసంహరించుకునే శత్రు దళాలను వెంబడించింది. వారికి తిరిగి సమూహపరచడానికి విశ్రాంతి లేదా సమయం ఇవ్వలేదు, ఇది మూడు రోజుల తరువాత జెనిడాను

స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. అతని నాయకత్వం మరియు దూకుడు యుద్ధ ప్రణాళిక ఫలితంగా పెద్ద సైనిక లాభాలు, అతనికి భారతదేశపు రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం అయిన మహా వీర్ చక్రం లభించింది. 

తదుపరి ఈ స్వర్ణిమ్ విజయ్ యాత్ర విశాఖపట్నం, కాకినాడల్లో నివసించే మాజీ సైనికులు సన్యాసి నాయుడు, కేజే క్రిస్టొఫర్

కుటుంబ సభ్యులను ఆర్మీ అధికారులు సన్మానించ నున్నారు. అనంతరం ఈ కాగడా తమిళనాడుకు వెళ్తుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam