DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

*23 న రథోత్సవం, 28 న లక్ష్మీనరసింహుని కల్యాణమహోత్సవం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 19, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

 ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం. అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కి ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభ స్వాగతం పలికి, ఆలయంలోనికి తీసుకువెళ్లారు. అంతరాలయం దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి

వారిని దర్శించుకున్న అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన  ప్రారంభించారు.

40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో

నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు.

ఈ రథం  ప్రారంభోత్సవ కార్యక్రమం లో దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర మంత్రులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

నేటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణమహోత్సవములు

ఆరంభమవుతున్నాయి. ఈ నెల 23 న రథోత్సవం జరుగనుంది, 28 న స్వామి తిరుకల్యాణం జరుగుతుంది.  

మాఘశుద్ధ సప్తమి శుక్రవారం నుండి మాఘబహుళ పాద్యమి ఆదివారం వరకు తేదీ.19.02.2021 నుండి ది.28.02.2021వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణమహోత్సవములు జరుగుతున్నాయి.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam