DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణ న్యాయవాది దంపతులు హత్య దుర్మార్గం

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: బ్రాహ్మణా సంఘ సమాఖ్య 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2021  (డి ఎన్ ఎస్):* తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది  గట్టు వామనరావు, నాగమణి దంపతులు హత్యకు గురికావడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర

ఉపాధ్యక్షులు జి వి ఎస్ ప్రభాకర్ రావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్  శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్ర  సంతాపం వ్యక్తం చేశారు. కోర్టు కేసు కోసం మంథని వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్న సందర్భంలో దారికాచి దంపతులిద్దరి దారుణంగా హత్య చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు.ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే బాధ్యులను గుర్తించాలని కోరారు.అదేవిధంగా న్యాయ పోరాటం చేసే న్యాయవాదులపై ఇటువంటి హింసాత్మక సంఘటన జరగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam