DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జంట హత్యలపై సిఐడి విచారణకు బ్రాహ్మణ సంఘాల డిమాండ్

*తెలంగాణ డిజిపి ని కలిసిన ఎల్ విఎస్ తదితరులు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2021  (డి ఎన్ ఎస్):* తెలంగాణ లోని మంథనిలో జరిగిన అడ్వకేట్ వామనరావు దంపతుల దారుణ హత్య ఉదంతంపై సీఐడీ ఉన్నతాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ బ్రాహ్మణా సంఘాల

ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కి విజ్ఞాపన పత్రం అందించారు. ఈ ఘటనలో నిష్పాక్షిక దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సీఐడీ ఉన్నతాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బృందం లో ఆంద్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సహా,

సీనియర్ పాత్రికేయులు దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ, చెరువు రాంబాబు,నరేశ్ కులకర్ణి, గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి,మంగపతిరావు, మల్లాది చంద్రమౌళి వివిధ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ బృందం డిజిపి తో హత్యోదంతం పై చర్చించింది. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని నిందితులందరికి శిక్ష పడేలా

దర్యాప్తు కట్టుదిట్టంగా జరిగేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam