DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*విశాఖ స్టీల్ పై రాష్ట్ర బీజేపీ వ్యాఖ్యలపై పార్టీల మండిపాటు 

*వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాదని బీజేపీ ప్రకటించగలదా?*

*సోము వీర్రాజు ప్రకటనపై పెరుగుతున్న వ్యతిరేకత* 
  
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ని ప్రైవేట్ చేస్తున్నట్టు కేంద్రం ఇంకా ప్రకటించకుండానే

ఉద్యమం పేరుతొ రాజకీయ పార్టీలు ప్రజల్లో ఆందోళనలు కల్గిస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి కేటాయింపులు చెయ్యకుండా, రైల్వే జోన్ పేరు మాత్రం ప్రకటించి, మారు మాట్లాడలేదని, పైగా ఇప్పుడు పోస్కో

సంస్థకు విశాఖ స్టీల్ కర్మాగారానికి విక్రయించడం పై  రాజకీయ పార్టీలు వేస్తున్న ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.  కేంద్ర అధిష్టానాన్ని ఒప్పించలేని రాష్ట్ర బీజేపీ ప్రతిపక్ష రాజకీయాలని విమర్శించడం ఏంటని మండిపడుతున్నాయి. 
తమపై విమర్శలు చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ వైజాగ్

స్టీల్ ప్రైవేట్ పరం కాదని కేంద్రంతో ప్రకటన చేయించగలదా? అని సవాల్ విసురుతున్నాయి. 

రాజ్యసభలో ఎంపీ విజయ సాయిరెడ్డి  అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన సమాధానం ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రం పెట్టుబడులను ఉపసరిస్తున్నట్టు కాదా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ మండిపడుతోంది. దీనిపై

శనివారం  విజయసాయి రెడ్డి విశాఖ లో 25 కిలోమీటర్ల దూరం సుమారు 1000 మందితో పాదయాత్ర చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam