DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 వ విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఏలూరు డిఐజి 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* ఏలూరు రేంజి పరిధిలో కృష్ణ జిల్లా లో  నూజివీడు రెవెన్యూ  డివిజన్ పరిధిలో ఈ నెల 21 న 4 విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో  రెవిన్యూ సబ్ డివిజన్  పరిధిలోని ఏలూరు రేంజి డిఐజి కెవి మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్

ద్వారా  సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా  సిబ్బందికి ఎన్నికల నియమ నిబంధనలను తెలిపారు.  విసన్నపేట ఏ కొండూరు, ముసునూరు మరియు తొమ్మిది మండలాల్లో లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ చేయడం కొరకు సిబ్బంది ని  సమాయత్తం చేసినట్లు

తెలిపారు 
సిబ్బంది అందరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని, ప్రజలతో మర్యాద గా నడుచుకోవాలి అని, ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం పాటించాలని, ఓటర్లు మినహా బయట వ్యక్తులు ఎవరూ పోలింగ్ మరియు కౌంటింగ్ సెంటర్ ల లోనికి ప్రవేశించకుండా చూడాలని అని

అన్నారు.

పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలి అని , విధుల పట్ల అలసత్వం ప్రదర్శించకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలని, సిబ్బందికి తగిన సూచనలు ఆదేశాలు ఇచ్చినారు.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధులు, శారీరక అంగవైకల్యం కలిగిన వారు, గర్భిణీ స్త్రీలు

మొదలైన వారికి సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాలపై ప్రజలందరూ నియమ నిబంధనలు పాటించాలని డిఐజి  తెలిపారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam