DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణ లో భీష్మ ఏకాదశి వేడుకలు

*23 న విజయ కీలాద్రి పై విరాట్ విష్ణు సహస్రనామ పారాయణ* 
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత  ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల 23 న విజయవాడకు సమీపంలో గల సీతానగరం (

గుంటూరు జిల్లా ) విజయ కీలాద్రి క్షేత్రం పై విరాట్ విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించనున్నారు. అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశిగా నిర్వహించుకోబడే మాఘ శుద్ధ ఏకాదశి  రోజున ( ఈ నెల 23 న) ఉదయం 11 గంటల నుంచి జీయర్ స్వామి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని 1 .)

https://www.facebook.com/jeeyarswamy , 2.)  https://www.youtube.com/user/jetworld తదితర సోషల్ మీడియా ల  ద్వారా లైవ్ ఇచ్చే అవకాశం ఉంది. 

ఈ వేడుకల్లో త్రిదండి చిన్న జీయర్ స్వామి తో పాటు, శిష్యులు త్రిదండి అహోబిల జీయర్ స్వామి, త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి, ఇతర ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. 

ప్రస్తుతం జరుగుతున్న ఈ విజయకీలాద్రి

క్షేత్రంలో జరుగుతున్న 4 వ వార్షికోత్సవాలు శనివారం  అత్యంత వైభవంగా ముగిసాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమంజన సేవ జరిగిన తదుపరి, సీతానగరం ఘాట్ కృష్ణనది లో అవభృద స్నానం, చక్ర తీర్ధము, సాయంత్రం శ్రీ పుష్ప యాగం, దేవతోద్వాసన, మహాపూర్ణహుతి, ధ్వజారోహణం తో పరిసమాప్తి అయ్యాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam