DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ విష్ణు సహస్రం వెయ్యి నామాల మహత్తు ఉన్న తాయత్తు

*ఎలా వీలయితే అలా చదువుకునే మహామంత్రం.*

*విజయకీలాద్రి భీష్మ ఏకాదశి వేడుకల్లో చిన్న జీయర్ స్వామి* 

*శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠంలో రామచంద్ర జీయర్ స్వామి* 

*వైభవంగా విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్)*  

*విశాఖపట్నం /

విజయవాడ, ఫిబ్రవరి 23, 2021 (డిఎన్ఎస్):* శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వెయ్యి నామాల మహత్తు ఉన్న తాయత్తు లాంటిదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అపర భగవద్రామానుజులు, ఉభయవేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేయారు. మంగళవారం మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా

సీతానగరం లోని విజయకీలాద్రి పై అత్యంత వైభవంగా విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విష్ణు సహస్రనామ ఆవిర్భావం, వైభవం, పఠనం వల్ల లభించే ఫలితాలను భక్తులకు వివరించారు. ఈ స్తోత్రం ఎలా వీలయితే అలా చదువుకునే మహామంత్రం అని, అత్యంత బిజీగా ఉండేవారు సైతం, ఖాళీ సమయాల్లో చదువుకుని, మధ్యలో

విరామం ఇచ్చి మళ్ళీ కొనసాగించవచ్చన్నారు. ఈ సందర్బంగా తెలియచేస్తూ. . . కురుక్షేత్ర యుద్ధానంతరం మాఘ శుద్ధ అష్టమి రోజున భీష్ముడు శ్రీమహావిష్ణువు వైభవాన్ని పాండవులకు తెలియచేసాడని, తదనంతరం ఆయన కాలం చేశాడన్నారు. అయితే అంత్యేష్టి కార్యక్రమం ముగిసిన తదుపరి నాలుగు రోజుల తదుపరి ఏకాదశి రోజున భీష్ముడు పాండవులకు

అనుగ్రహించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం బాహ్య ప్రపంచానికి తెలిసిందన్నారు. నాటి నుంచే మాఘ శుద్ధ ఏకాదశి రోజును భీష్మ ఏకాదశి గాను, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఆవిర్భావ ( జయంతి) దినోత్సవంగానూ ఆచరిస్తున్నట్టు తెలిపారు.  భీష్ముడు శ్రీవిష్ణు సహస్రనామాన్ని పాండవులకు అనుగ్రహిస్తున్న సమయంలో సాక్షాత్తు

శ్రీకృష్ణుడు సాక్షీభూతంగా నిలిచిందన్నారు. అంపశయ్యపై అవసాన దశలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భీష్మునికి ఈతిబాధలు తెలియకుండా ఉండేలా శక్తిని ఇచ్చి మరీ అత్యంత విలువైన సందేశాన్ని ఈ విశ్వానికి అందింపచేశాడన్నారు. అదే విధంగా భగవద్గీత ఆవిర్భావం జరిగింది మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున అని, దీనికి ప్రత్యక్షంగా

విన్నవారు ముగ్గురేనన్నారు. వారిలో ఒకరు అర్జునుడు కాగా, అక్కడే రథంపై ఉన్న హనుమ తో పాటు దివ్య దృష్టి కల్గిన  సంజయుడు అన్నారు. అయితే భీష్ముని యుద్ధ నిష్క్రమణ అనంతరం ఏకాదశి రోజున ప్రపంచానికి తెలియడం వలన ఆరోజునే గీతా జయంతిగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. 
అనంతరం భక్తులకు శ్రీ లక్ష్మి అష్టోత్తర స్తోత్రం, శ్రీ

విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశ పూర్వకంగా పారాయణ అనుగ్రహించారు. 

ఈ కార్యక్రమం లో స్వామిజి శిష్యులు త్రిదండి అహోబిల జీయర్ స్వామి, త్రిదండి దేవనాథ జీయర్ స్వాములు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

భీమవరం జీయర్ స్వామి  ఆశ్రమం లో. : . .

భీమవరం లోని  శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం లో

జరిగిన భీష్మ ఏకాదశి వేడుకల్లో భాగంగా పీఠాధిపతులు త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులతో శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహింపచేసారు. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ ఆవిర్భావం, వైభవాన్ని భక్తులకు తెలియచేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam