DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ పురోహిత బ్రాహ్మణా సమాఖ్య ఉపాధ్యక్షునిగా కన్నబాబు 

*అన్నవరం వ్రత సంఘం మాజీ అధ్యక్షునికి అభినందనలు.* 

*ఏఐబిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ *

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 23, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురోహిత బ్రాహ్మణా సమాఖ్య ఉపాధ్యక్షునిగా అన్నవరం శ్రీ

సత్యనారాయణ స్వామి దేవస్థానం వ్రత పురోహిత సంఘం పూర్వ అధ్యక్షులు చామర్తి వెంకట రెడ్డి పంతులు ( కన్నబాబు ) ఎన్నికవ్వడం పట్ల ఆలిండియా బ్రాహ్మణా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ అభినందనలు తెలియచేసారు. మూడు దశాబ్దాలుగా అన్నవరం లోని రత్నగిరి పై వేంచేసిన రమా సహిత  శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి

సన్నిధిలో సేవలు అందిస్తూ. . . అధికారులు, అనధికారులు, భక్తుల ప్రశంసలు అందుకుని వర్ధమాన తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. ఈ మేరకు పురోహిత బ్రాహ్మణా సమాఖ్య అధ్యక్షుడు భళ్ళముడి దివాకర శాస్త్రి నుంచి ఉపాధ్యక్షునిగా నియామక లేఖ అందినట్టు కన్నబాబు తెలియచేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పురోహితులు ఎదుర్కొంటున్న

సమస్యలపై పూర్తి అధ్యయనం చేసి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలియచేస్తున్నారు. 

DNS బృందం అభినందనలు. . .

అన్నవరం దేవస్థానం లో అత్యంత వ్రత పురోహితులు చామర్తి వెంకటరెడ్డి పంతులు రాష్ట్ర పురోహిత, బ్రాహ్మణా సంఘం ఉపాధ్యక్షునిగా నియమితులైన సందర్బంగా DNS మీడియా బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

దేవస్థానం ప్రతినిధి గా రాష్ట్రంలోనే కాక, రాష్ట్రేతర ప్రాంతాల్లో సైతం సత్యదేవుని వ్రత, శాంతి కల్యాణాలు, నిర్వహించి, ఆయా ప్రాంతాల్లోని భక్తులందరి మన్ననలూ అందుకున్నారు కన్నబాబు. అన్నవరం క్షేత్ర వైభవం తో పాటు, ఆధ్యాత్మిక, ఆలయ వైశిష్ట్యాల పై పూర్తి అవగాహన కలిగి భక్తులందరికీ సవివరంగా తెలియచేయడం లో దిట్ట ఈయన.

పీఠాధిపతులు, ప్రముఖులు, విదేశీయులు తదితరులు ఆలయ దర్శనానికి వచ్చిన సందర్భాల్లో ఆలయ ప్రతినిధిగా వీరు సంపూర్ణ సహకారం అందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam