DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకట కృష్ణా. .కేసు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోండి

*ఏబీఎన్ లో విష్ణు పై దాడి కి మండిపడుతున్న సభ్య సమాజం*

*ఏఐబిఎఫ్ జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ డిమాండ్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2021  (డి ఎన్ ఎస్):* మంగళవారం రాత్రి ఏబీఎన్ టీవీ డిబేట్ లో జరిగిన ఘటనపై ఛానెల్ పొలిసు కేసు పెట్టి తమ

చిత్తశుద్ధి నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ నేత, ఆలిండియా బ్రాహ్మణా ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ డిమాండ్ చేసారు. మంగళవారం రాత్రి 7 :30 గంటల సమయంలో ఏబీఎన్ ఛానెల్ లో యాంకర్ వెంకట కృష్ణ నిర్వహిస్తున్న డిబేట్ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నేత మంచి వాగ్దాటి

ఉన్న ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ గళాన్ని వినిపిస్తూన్న సందర్బంలో సహచర వక్త అమరావతి జె ఏ సి నేత శ్రీనివాస రావు  విచక్షణ కోల్పోయి చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలా విచక్షణ లేని వ్యక్తులను డిబేట్ లోకి పిలవడం ఛానెల్ చేతగానితనంగా అభివర్ణించారు. ఇది పూర్తిగా ఛానెల్ నిర్వాహకుల

తప్పిదమేనన్నారు. 
అయితే ఈ ఘటన అనంతరం శ్రీనివాసరావు ను బయటకు పంపినప్పడికీ, యాంకర్ వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మీ మాటల్లో దాడి చేసిన వ్యక్తి కులం పేరు మీరు ప్రస్తావించారని, ఈ ఘటనపై సోషల్ మీడియాలో బిజెపి అభిమానులు సంతోషిస్తున్నారనడం చాలా బాధాకరం అన్నారు. ఆ వ్యక్తి తన చెప్పు తీసి

కొట్టేముందు ఆ చేతిని కాకుండా రెండవ చేతిని పట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడి వెనక ఎవరి కుట్ర ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు. 

ఈ దాడి కేవలం విష్ణువర్ధన రెడ్డి పై మాత్రమే జరిగిన దాడిగా మేము భావించడం లేదని, సభ్య సమాజం పై జరిగిన దాడిగా భావిస్తున్నాము.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam