DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా మళ్ళీ వ్యాపిస్తోంది - విచ్చ‌ల విడిత‌నం వదలండి 

*విజృంభించకుండా ప్రతి ఒక్కరూ జాగ్ర‌త్త‌లు పాటించాలి*

*తిరుచానూరు యాత్రలో చిన్న జీయర్ స్వామి వెల్లడి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* కరోనా మరోసారి వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోందని, విచ్చలవిడితనం వదిలి, ప్రతి

ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. గురువారం తిరుచానూరు అలివేలుమంగా దేవాలయానికి వచ్చిన ఆయన, దర్శనం అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సూచనలు చేసారు. గత ఏడాది కాలం ఎంతో జాగ్రత్తగా, క్రమశిక్షణతో ఉన్నారని, అయితే ప్రస్తుతం కనీస జాగ్రత్తలు

పాటించేవారు సంఖ్యా తక్కువగానే ఉందన్నారు. ప్రస్తుతం త‌గ్గి పోయింద‌నుకున్న క‌రోనా వ్యాధి మ‌ళ్ళీ ప్ర‌బ‌లుతోంద‌నే ఆందోళ‌న ప్రారంభ‌‌మైందని, ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ, ప‌రిశుభ్ర‌త‌తో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా మ‌స‌లు కోవాల‌న్నారు. ఈ విప‌‌త్క‌ర ప‌రిస్థితి నుండి

ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించాన‌న్నారు. ప‌విత్ర‌మైన మాఘ‌మాసంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌డం పుణ్య‌దాయ‌క‌మ‌ని చెప్పారు.

ఏపీ లో ఆలయాల సందర్శన. . . :

      ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆల‌యాల మీద స‌మాజ విఘాత శ‌క్తులు దాడులు చేసి విగ్ర‌హాలు ధ్వంసం చేసిన

నేప‌థ్యంలో తాను రాయ‌ల‌సీమ‌లోని అనేక ఆల‌యాల‌ను సంద‌ర్శించిన‌ట్లు చెప్పారు. ఈ ఆల‌యాల్లో ఆద్భుత శిల్ప‌సంప‌ద‌, శ‌క్తి వంత‌మైన దేవ‌తా విగ్ర‌హాలు ఉన్నాయ‌న్నారు. ఆల‌యాల‌కు ఆద‌ర‌ణ‌, ఆరాధ‌న క‌ల్పించేందుకు కొన్ని సూచ‌న‌ల‌తో టిటిడి ఛైర్మ‌న్ వై వి సుబ్బారెడ్డికి నివేదిక

అందించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆల‌యాలు బాగుప‌డితే ప్ర‌జ‌ల్లో విశ్వాసం, రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి స‌మాజం ఆరోగ్య క‌రంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆరోగ్యంగా ఉండాల‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారిని కూడా ప్రార్థిస్తానని  జీయ‌ర్‌ స్వామి చెప్పారు.  

     ఆల‌యం వ‌ద్ద

స్వామివారికి టిటిడి ఛైర్మ‌న్ వై వి సుబ్బారెడ్డి దంప‌తులు, రాష్ట్ర మంత్రి  చెల్లు‌బోయిన వేణుగోపాల కృష్ణ, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జవ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో ఏ. వి. ధ‌ర్మారెడ్డి, ఆల‌య అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.
జీయ‌‌ర్‌స్వామి అమ్మ‌వారి ఆల‌య

ప్ర‌ద‌క్షిణ అనంత‌రం ధ్వ‌జ‌స్థంభానికి న‌మ‌స్క‌రించి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ‌‌‌‌అనంత‌రం ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ‌స్వామి, శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. స్వామి వెంట వారి శిష్యులు అహోబిల జీయర్ స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు

జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు, శివ‌కుమార్‌, వెంక‌ట భాస్క‌ర్‌రావు, ఆల‌య డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam