DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పోర్ట్ ఒప్పందాల రికార్డు, 6 సంస్థలతో రూ. 30 వేలకోట్లు

*మారిటైం సదస్సు నేపథ్యంలో భారీ ఒప్పందాలకు శ్రీకారం*

*హెచ్ పిసిఎల్ తో 26 వేల కోట్లు, మిట్టల్ సంస్థ తో 600 కోట్లు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* మార్చి 2 న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మారిటైమ్

ఇండియా సమ్మిట్ 2021 లో భాగంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రికార్డు స్థాయిలో రూ. 30 వేల కోట్ల విలువైన పనులకై అవగాహన ఒప్పందాల ను కుదుర్చుకుంది. హెచ్ పిసిఎల్,  ఆర్సెల్లర్  మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ తదితర సంస్థలతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మొత్తం ఆరు సంస్థలతో  రూ. 30,443.91 కోట్ల మేర పనులకు ఒప్పందం కుదుర్చుకుంది.

శుక్రవారం పోర్ట్ ప్రధాన కార్యాలయం లో జరిగిన సమావేశంలో ప్రధానంగా హెచ్ పిసిఎల్,  ఆర్సెల్లర్  మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ ( ఏఎం / ఎన్ఎస్ ) తో రూ. 600 కోట్లు, డ్రెజ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా తో  రూ. 100 కోట్లు, జెడి ఫిషరీస్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో రూ. 100 కోట్లు, ఇంటెగ్రల్ విభాగం తో రూ. 38 కోట్లు, ఇతర సంస్థలతో రూ. 3316.91 కోట్లు

ఒప్పందం కుదుర్చుకుంది.       

వాటిల్లో హెచ్ పిసిఎల్ ( కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ) తో రూ. 26,264 కోట్ల తో 110 ఎకరాల స్థలంలో విస్తరణ పనులను ఒప్పందం కుదిరింది. దీనిలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తరపున డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే , విశాఖ రిఫైనరీ  హెచ్ పిసిఎల్ ) తరపున ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పి వీరభద్ర రావు

లు సంతకం చేసారు.


ఏ ఎం ఎన్ ఎస్ తో రూ. 600 కోట్ల తో 157 ఎకరాల స్థలంలో ప్లాంట్ విస్తరణ పనులను ఒప్పందం కుదిరింది. దీనిలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తరపున డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే , ఏ ఎం ఎన్ ఎస్  తరపున విశాఖ అధికారి ఎం. రవీంద్రనాధ్ లు సంతకం చేసారు.

డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ( డి సి ఐ) తో రూ. 125 కోట్ల

తో విశాఖ పట్నం లోని రామకృష్ణ బీచ్ ప్రాంతంలో పారిశుధ్య, అభివృద్ధి కార్యాచరణ రానున్న 5 ఏళ్ళ కాలానికి గాను ఒప్పందం కుదిరింది. దీనిలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తరపున డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే , డి సిఐ తరపున సంస్థ ఎండి రాజేష్ త్రిపాఠి లు సంతకం చేసారు.

జాయింట్ డైరక్టర్ ఫిషరీస్ ( ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ రంగ సంస్థ) తో  రూ. 100 కోట్ల తో ఫిషింగ్ హార్బర్ ను అభివృద్ధి పరిచేందుకు ఒప్పందం కుదిరింది. దీనిలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తరపున డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే , ఫిషరీస్ విభాగం తరపున జాయింట్ డైరక్టర్ డా. కె. ఫణి ప్రకాష్ లు సంతకం చేసారు.

ఇంటెగ్రల్ సంస్థ తో  రూ. 38 కోట్ల తో హార్బర్ లో అత్యధిక

ఉత్పత్తి కోసం మొబైల్ క్రేన్ ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఒప్పందం కుదిరింది. దీనిలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తరపున డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే , ఇంటెగ్రల్ తరపున సంస్థ వైస్ ప్రెసిడెంట్  వి. మెహర్ సంతోష్ లు సంతకం చేసారు.

మరో 23 ఇతరత్రా ఒప్పందాలను రూ. 3316.91 కోట్లతో సంతకం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam