DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

*రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసమైన ఆలయాలను దర్శించాం*  

*తిరుమల యాత్రలో త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి వెల్లడి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుమల / విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత

ప్రభుత్వానిదే అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపరరామానుజులు, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని చిన్నజీయ్యర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చి, మాడా వీధులు దాటినా తర్వాత ఆయన

మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4 లక్షల 60 వేల  ఎకరాల భూమి ఉందని తెలిపారు. కొన్ని కారణాల చేత ఆలయాల ఆస్తులు చాలా ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన వారు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. పరివేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలోని పలు

ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించామని, ఈ ఆలయాలలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో ఓ విఙ్ఞాపన పత్రాన్నీ, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అందజేసినట్లు తెలిపారు. తమ సూచనల పట్ల సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీలో చాలా ఆలయాలు

అభివృద్దికి నోచుకోకుండా ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయాలు బాగున్నప్పుడే ప్రజలలో నైతిక ప్రవృత్తి బాగుపడుతుందని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి వెల్లడించారు.
స్వామి వెంట శిష్యులు త్రిదండి అహోబిల జీయర్ స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు జూప‌ల్లి

రామేశ్వ‌ర‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

అంతకు ముందు స్వామి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో టిటిడి చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డి దంపతులు జీయర్ స్వామి గారికి  శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam