DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ విద్యా సంస్థల్లోనే ఆధార్ అప్ డేషన్ క్యాంప్ ల సేవలు

*ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* 

*విశాఖ ఆధార్ సేవ కేంద్రం ఇంచార్జి పి. శ్రీహరి వెల్లడి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం ఆధార్ సేవ కేంద్రం ద్వారా స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులకు, 5 ఏళ్ళు, 15

సంవత్సరాలు దాటిన పిల్లలకు బయో మెట్రిక్ నవీకరణ చేయనున్నట్టు సంస్థ ఇంచార్జి పి. శ్రీహరి తెలియచేసారు. ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ గుర్తింపు తప్పని సరి అని, బయోమెట్రిక్ కూడా తప్పని సరి అని తెలిపారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవకాశం లేనందున, నేరుగా విద్యాసంస్థల చెంతకే తమ సిబ్బంది తో క్యాంప్

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పాత గాజువాక లోని ఆధార్ సేవ కేంద్రం ద్వారా చైతన్య నగర్ లోని శ్రీ సూర్య తేజ స్కూల్ లో ఆధార్ సేవలతో క్యాంపు నిర్వహించబడుతోందన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ పి సౌజన్య  ఆద్వ్యర్యంలో ఇప్పటివరకు రెండు వందల పైన పిల్లలకి నవీకరణ  జరిగిందన్నారు. 
ఈ సందర్బంగా సెంటర్ మేనేజర్ పోలవరపు

శ్రీహరి, ఆపరేషన్ మేనేజర్ - బొబ్బిలి రికేష్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. 
ప్రతి పాఠశాల, విద్యాసంస్థలు, కళాశాలలు ఈ  అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని వారు తెలియజేశారు. తమ విద్యా సంస్థల్లో చిన్నారులకు ఈ అవకాశం అందించాలనుకునే వారు తమ సంస్థ ప్రతినిధులను పి. శ్రీహరి  (ఫో : 9445668974),  బి రికేష్ కుమార్  (ఫో:  - 9030566143) లను

సంప్రదించవచ్చన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam