DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో స్కూళ్ళు, కళాశాలలు యధావిధిగా నడుస్తాయి: మంత్రి సురేష్

*స్కూల్స్ సెలవంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం*

*అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలకు ఏపీ విద్యాశాఖ సన్నద్ధం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* కరోనా మరోసారి వెలుగుచూస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా

విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారంటూ  అంటూ సోషియల్ మిడియాలో వస్తున్నవార్తల్లో వాస్తవం లేదని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ తెలియచేసారు. అన్ని తరహాల విద్యా సంస్థలు యధావిధిగా నడుస్తాయన్నారు. ఈ అంశం పై కడప లో అయన మాట్లాడుతూ కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న

వార్తలో నిజం లేదన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దని సూచించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 

అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు తగిన ఆదేశాలు జారీచేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాల విద్యాశాఖాధికారులు పాఠశాలలు యధావిధిగా నిర్వహించబడతాయని ఆదేశాలు జారీచేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam