DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రకటించినట్టుగానే మార్చి 10 నే ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు

*16 ఎన్నికల నిర్వహణ అభ్యంతరాలను కొట్టేసిన హైకోర్టు*   

*27 నుంచి ఎస్ఈసి రమేష్ కుమార్ రాష్ట్ర పర్యటన*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 26, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త

నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామనేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని

ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. యథావిధిగా మార్చి 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది

27 నుంచి ఎస్ ఈ సి రాష్ట్ర పర్యటన : . ..

మునిసిపల్ ఎన్నికలు షెడ్యూల్

ప్రకారమే నిర్వహణ జరగనున్న సందర్బంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 13 జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటన చెయాయనున్నారు. 28న పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, జిల్లాల్లో

పర్యటించనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam