DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఆలయ ఈఓ గా సూర్యకళ నియామకం

*ఈమె నియామకాన్ని గత ఏడాదే జరుగుతుందని DNS లో కధనం*
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచల క్షేత్రం నూతన కార్యనిర్వాణాధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ

విభాగానికి చెందిన ఉప కలెక్టర్ ఎం వి సూర్యకళ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం విశాఖపట్నం పరిధిలోని జాతీయ రహదారులు 16 విభాగం లో ఉప కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సూర్యకళను అత్యంత ప్రఖ్యాత దేవాలయానికి కార్యనిర్వాణాధికారిగా నియమించడం శుభపరిణామం గా

తెలుస్తోంది. 

అయితే ఈమె నియామకం గత ఏడాదే జరగవలసి ఉంది. గత ఏడాది ఆగస్టు లోనే ఈమె నియామకం దాదాపు ఖరారు అయ్యింది, అదే విషయాన్నీ DNS మీడియా లో కధనం కూడా ప్రచురణ చేయడం జరిగింది. స్థానిక పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్ష లో ఉన్నందున ఈఓ నియామకం లో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. చాతుర్మాస్య దీక్ష ముగిసిన అనంతరం నూతన ఈఓ

విధుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభిస్తాయని అంటా భావించారు. అయితే ప్రభుత్వం లో కొన్ని అంతర్గత జాప్యం కారణం వల్ల ఈమె నియామకం దాదాపు 8 నెలలు ఆలస్యం అయ్యింది. 
కరోనా మహమ్మారి విజృంభణ, తదుపరి కారణాంతాల వల్ల నియామకం జాప్యం జరిగింది. గత ఏడాది దేవస్థానంలో వెలుగు చూసిన పలు వివాదాలు, కుంభకోణాల

నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు నిబద్దత కల్గిన అధికారిగా పేరు ఉన్న ఈమెను నియమించాలని అధికారులు, భావించారు. పైగా గతంలోనూ విశాఖ పరిధిలోనే విధులు నిర్వహించడం కూడా ఒక కారణం. అన్నింటికీ మించి దైవభక్తి, పీఠాధిపతుల మంగళాశాసనాలు కూడా ఉండడం ఒక కారణం కావచ్చు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam