DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భగవద్గీత ఆవిర్భావ స్థలంలో గీతా పఠనం చేస్తే జన్మ ధన్యతే

*జ్యోతిసర్ అశ్వర్ధ వృక్షం నీడలో వేదపండితుల గీతాపఠనం*

*సప్త ఋషి చారిటబుల్ వేదపరిక్రమణ బృందం ఆనందం* 

*కురుక్షేత్రకు చేరుకున్న శంకర వేదయాత్ర బృందం*
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 2, 2021 (డి ఎన్ ఎస్):* గతనెల 14 న విశాఖ లోని సప్తఋషి చారిటబుల్

సంస్థ వద్ద ఆరంభమైన భారత వేదపరిక్రమణ - శంకర యాత్ర కురుక్షేత్రకు చేరుకుంది. ఈ  వేదపండితుల బృందం చేస్తున్న శంకర యాత్ర కురుక్షేత్రకు చేరుకుంది. కోట్లాదిమంది మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన శ్రీమద్భగవద్గీత ఆవిర్భావ స్థానం మైన జ్యోతి సర్ లోని అశ్వర్ధ వృక్షం నీడలో ఈ వేదపండితుల బృందం భగవద్గీత పఠనం చేసినట్టు బృంద

నిర్వాహకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ తెలియచేసారు. ఈ మేరకు DNS తో మాట్లాడుతూ భగవద్గీతను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారని, అయితే గీత ఆవిర్భవించిన ప్రదేశంలో పఠనం చేసే అవకాశం అతి తక్కువమందికి లభిస్తుందన్నారు. ఈరోజు గీత పతనంతో తమ జీవితం ధన్యత చెందిందన్నారు. 

జ్యోతి సర్ :
'జ్యోతి' అంటే కాంతి, 'సర్' అంటే ప్రధాన

అర్ధం. అందువల్ల స్థలం పేరు 'కాంతి యొక్క ప్రధాన అర్ధం' లేదా చివరికి దేవుని యొక్క సూచన. ఇది పవిత్ర నగరం కురుక్షేత్రంలోని అత్యంత గౌరవనీయమైన పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఒక వాట్ (మర్రి చెట్టు) పెరిగిన స్తంభంపై నిలుస్తుంది. స్థానిక సంప్రదాయాలు ఈ చెట్టు పవిత్ర మర్రి చెట్టు యొక్క ఒక శాఖ అని, దీని కింద కృష్ణుడు భగవద్గీత యొక్క

ఉపన్యాసం, కర్మ మరియు ధర్మ సిద్ధాంతాలను తన కదిలే స్నేహితుడు అర్జునుడికి ఇచ్చాడు. ఇక్కడే అతను తన విరాట్ రూప (యూనివర్సల్ రూపం) ను చూపించాడు.

ఇదే స్థానంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన విశ్వరూప సందర్శనం చూపినట్టు ఆధారాలున్నాయి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam