DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హనుమాన్ ఆలయ అర్చకులు తాతాజీ హఠాత్ నిష్క్రమణ 

*ప్రగాఢ సంతాపం తెలిపిన శ్రీవైష్ణవ సంఘం, ప్రముఖులు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 2, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం శివారు ప్రాంతమైన చినముషిడివాడ లో గల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పెడలి వేంకట తాతాచార్యులు (తాతాజి గారు) మార్చి 1 న

పరమపదించారు. అందరికి అందుబాటులో ఉంటూ, వందలాది ఉత్సవాలు, వేడుకలు, శుభకార్యక్రమాలు, జాతరలో ఈయన ప్రత్యక్షంగా పాల్గొంటూ, పరిసర గ్రామాల ప్రజల అందరి అభిమానాన్ని చూరగొన్నారు. వీరు సువర్చల అభయ మారుతీ పీఠం సైతం నిర్వహిస్తూ, ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆంజనేయ స్వామికి విశేష పూజలు, ఉత్సవాలు, వేడుకలు

నిర్వహిస్తూఅందించి తనదైన శైలిలో భక్తులకు చేరువయ్యారు ఈయన అకాల మరణం అందరిని కలిచి వేసింది. మూడు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక ముషిడివాడ ప్రాంతంలోని పీఠాధిపతులు సైతం తల్లో నాలుకలా ఉంటూ వారి ఆశీస్సులు కూడా పొందారు తాతాజీ.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam