DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైజాగ్ స్టీల్ పై ఆ పార్టీలు ఓటుబ్యాంక్ రాజకీయం చేస్తున్నాయి

*ప్రయివేటీకరణ అంత సులభం కాదు, అపోహలు వద్దు*

*సంస్థ, ఉద్యోగుల భవిష్యత్ చూసే అడుగులు వేస్తుంది.* 

*వైజాగ్ స్టీల్ కంటే ముందు మరో 34 సంస్థలున్నాయి.* 

*స్టీల్ ప్లాంట్ పై కేంద్ర వైఖరి ని వెల్లడించిన ఎంపీ జివిఎల్*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మార్చి 2, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్ష పార్టీలు అన్నీ రాజకీయం చేసి, ఓట్లు దండుకునే ప్రయత్నం లో ప్రజలను ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేస్తున్నాయని, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మండిపడ్డారు.

మంగళవారం విశాఖపట్నం బీజేపీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చెయ్యడం అంత సులభం కాదన్నారు. ఈ అంశంపై అపోహలు వద్దని, అందరితో సానుకూల వాతావరణంలో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయల కోసం ప్రజల

మనోభావాలు అనే పేరు చెప్పి,  ఉత్తుత్తి ఉద్యమం చేస్తున్న రాజకీయ పార్టీలను హెచ్చరించారు.

ఉద్యోగుల భవిష్యత్తే కేంద్రానికి ముఖ్యం:. . .. 

కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వ్యాపారం చెయ్యదని, లాభనస్థలు బేరీజు వెయ్యదని, ఉద్యోగులు, కార్మికులకు శ్రేయస్సు కలుగుతుందా లేదా అనే అంశాన్నే చూస్తుందన్నారు. సంస్థ లో

పనిచేసే ఉద్యోగుల భవిషత్ కు బంగారు బాట వేసిన తర్వాతే తదుపరి అంశం పై చర్యలు తీసుకుంటుంది తప్ప, కళ్ళు మూసుకుని ఎటువంటి నిర్ణయాలూ తీసుకోదన్నారు. దీనిపై తానూ రాజ్యసభ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన నేరుగా సభలోనే చెప్పడం జరిగిందన్నారు. ఉద్యోగుల భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అని అడగడం

జరిగిందన్నారు. 

ముందు మరో 34 సంస్థలున్నాయి : . . .  

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కోసం తయారు చేసిన జాబితా లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ( రాష్టీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ) 35 వ స్థానం లో ఉందని, ముందుగా ఉన్న అన్ని సంస్థలను క్రమబద్దెకరించిన తర్వాతే. . .ఈ సంస్థ గురించి ఆలోచించే పరిస్థితి

ఉందన్నారు. ప్రతి సంస్థనూ క్రమబద్దీకరించి సమయంలో సంస్థలోనూ ఉద్యోగులు, కార్మికుల శ్రేయస్సుకే కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, వారికి సంతృప్తి పరిచి, వారి ఆమోదం తీసుకున్న తర్వాతే. . .తదుపరి కార్యాచరణను చేపడుతుందన్నారు.  ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బీజేపీ ప్రజల

శ్రేయస్సు కోసం పనిచేస్తే పార్టీ యే  తప్ప, ఇతర రాజకీయ పార్టీల లాగా ప్రజల జీవితాలను బుగ్గి చేసే పార్టీ కాదన్నారు. 

రాజకీయ పార్టీలకు సవాల్ . . :

వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం పై స్థానిక రాజకీయ పార్టీలు, వామపక్షాలు లేనిపోని అభూతకల్పనలు జోడించి, ఉత్తుత్తి ఉద్యమం చేస్తూ, ప్రజలని భయబ్రాంతులకు

గురిచేస్తున్నారన్నారు. సంస్థ ఉద్యోగులకు సంస్థ లో భాగస్వామ్యం కల్పిస్తుందని, అవకాశం ఉంటె, వారు సైతం సంస్థలో భాగస్వాములు కావచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam