DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వన్య ప్రాణి సంరక్షణ భాద్యత సమాజానిదే: డా. నందనీ

*విశాఖ జూ లో ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం లో క్యూరేటర్* 
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 4, 2021  (డి ఎన్ ఎస్):* సమాజంలో ప్రజలతో పాటు జీవనం సాగిస్తున్న వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత సమాజం పైనే ఉందని, విశాఖపట్నం లోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్

క్యురేటర్ డా. నందనీ సలారియా తెలియచేసారు.  ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం సందర్భంగా విశాఖ జూ పార్క్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 7 సంవత్సరాల వయసు నుంచి 27 సంవత్సరాల వయసు వరకు ఉన్న విద్యార్థులు దాదాపు 80 మంది ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.  విశాఖ జూ లో ఉన్న వన్యప్రాణులు గురించి, సీతాకోక

చిలుకలు జీవ వైవిధ్యం, పాములపై అందరిలో ఉన్న కొన్ని నమ్మకాలు, వాటి వెనుక ఉన్న నిజాలు గురించి ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు వివరించారు. జూ లో పర్యటన నిర్వహించి ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఉన్న జంతువుల గురించి, వాటి ఆహార అలవాట్లు, ఆసక్తికర విషయాలు విద్యార్థులకు వివరించారు. 

వన్యప్రాణులను సంరక్షించడం లో

జంతు ప్రదర్శన శాలలు ఎంతో చొరవ తీసుకుంటాయన్నారు క్యురేటర్.  విద్యార్థులు కూడా చిన్నప్పటి నుంచే మన చుట్టూ ఉన్న ప్రాణులను రక్షించడంలో ముందుండాలని సూచించారు. మన ప్రకృతిలో అన్ని జీవులు సమతౌల్యంగా ఉండాలి అంటే వన్య ప్రాణులు, మన చుట్టూ ఉన్న ఎన్నో జీవులు అవసరం ఉందన్నారు. కాబట్టి వాటిని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మన

మీదే ఉందని అన్నారు.  భూమి మీద ఉండే ప్రాణులు మాత్రమే కాకుండా సముద్రంలో ఉండే జీవుల్ని కూడా కాపాడుకోవాలని, ప్లాస్టిక్ వేస్ట్ ను సముద్రంలో పడేయకుండా నిర్మూలించాలని తెలిపారు.  
సమావేశం తదుపరి వన్యప్రాణి జీవనం పై నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. విజయం సాధించిన విద్యార్థులు కు

క్యురేటర్ నందని సలారియ బహుమతులు ప్రధానం చేశారు. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించారు.

జూ పార్క్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమం సందర్శకులను ఆకట్టుకుంటోంది. 
"వన్యప్రాణులను రక్షించడంలో నా మద్దతు తెలియజేస్తున్నాను" అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ సంతకాల

సేకరణ కార్యక్రమంలో విద్యార్థులు, సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా క్యురేటర్ నందని సలారియ మొదటి సంతకంతో కార్యక్రమం ప్రారంభించగా మేము సైతం వన్యప్రాణి సంరక్షణలో ముందుంటాం అంటూ సందర్శకులు సంతకాలు చేశారు. వన్యప్రాణుల ఫోటోలతో ఉన్న ఈ బ్యానర్ అందరినీ ఆకట్టుకుంటోంది. వన్యప్రాణుల సంరక్షణ పై ప్రజల్లో అవగాహన

కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం వన్యప్రాణి సంరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న కార్యక్రమాలు పై వెబినార్ నిర్వహించారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి సీనియర్ శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు, NGO ప్రతినిధులు , ఔత్సాహిక పరిశోధకులు ఈ వెబినార్ లో

పాల్గొన్నారు. ఇప్పటి వరకు వన్యప్రాణి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై ఈ వెబినార్ లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా INS కళింగ పాఠశాల కు చెందిన విద్యార్థులు జూ సందర్శించారు. వన్యప్రాణి సంరక్షణ కు సంబంధించిన

ప్లకార్డ్స్ ను ప్రదర్శించారు. అనంతరం సముద్రంలోని జీవులు, వాటి రక్షణ అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam