DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్ఏడి ఫ్లై ఓవర్ ప్రాణాంతకంగా మారింది : జి వి ఎల్ మండిపాటు

*రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పై కేంద్ర మంత్రి కి ఫిర్యాదు చేస్తాం. .* 

*పాలకుల నిర్లక్ష్యం తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.* 

*స్మార్ట్ సిటీ కోసం ఇచ్చిన నిధులు పూర్తిగా దుర్వినియోగం* 

*ఎన్ఏడి ఫ్లై ఓవర్ స్థితిగతులపై బీజేపీ బృందం పరిశీలన*
 
*టీడీపీ, వైకాపా లు సమాధానం

చెప్పాల్సిందే.: ఎంపీ జివిఎల్ డిమాండ్* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 4, 2021  (డి ఎన్ ఎస్):* కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కోసం విశాఖపట్నం కు ఇచ్చిన వేల కోట్ల నిధుల్లో భాగంగా నిర్మించిన ఎన్ ఏ డి ఫ్లై ఓవర్ అత్యంత ప్రాణాంతకంగా మారిందని రాజ్య సభ సభ్యులు,

బీజేపీ కేంద్ర అధికార ప్రతినిధి జి. వి. ఎల్ నరసింహారావు మండిపడ్డారు. గురువారం నగరంలోని అత్యంత రద్దీ కూడలి ఎన్ ఏ డి వద్ద నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ స్థితిగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన పలువురు ఆటో డ్రైవర్లతోను, వాహనదార్లతోను, ఇతర భారీ రవాణా వాహనదారులతోను మాట్లాడారు. ఈ ఫ్లై ఓవర్ పై తరుచుగా జరుగుతున్నా

ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడినట్టుగా తెలుసుకుని ఆవేదన చెందారు. దీనికి గల కారణాలపై ఆచూకీ తీశారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వివరించారు. 

దేశంలో నరేంద్ర మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదటగా ప్రకటించిన మూడు స్మార్ట్ సిటీ నగరాల్లో

ఒకటి విశాఖపట్నం అన్నారు. కేంద్రం విశాఖ నగరానికి అంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి నిర్లక్ష్యం, తప్పిదాలు, వైఫల్యాల వల్ల కేంద్రం ఇచ్చిన నిధులు వృధా అవుతు ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయన్నారు.    

రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం:. .. 

కేంద్ర ప్రభుత్వం విశాఖ నగరాన్ని

స్మార్ట్ సిటీ గా ఎంపిక చేసి వేలకోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, దానిలో భాగంగానే ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా చేపట్టిందన్నారు. అత్యంత నిర్లక్ష్య మైన ప్లాన్ తో, నాసిరకమైన నిర్మాణం చేసి, ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న పాపం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

చేసారు. ఈ నిర్మాణం 2018 లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని కోట్ల నిధులు ఇస్తే, నాటి సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత నాసిరకంగా దీన్ని కట్టించి, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటె ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కాదన్నారు. దీనికి చంద్రబాబు నాయుడే భాద్యత

వహించాలన్నారు. 

ఫ్లై ఓవర్ పై రవాణా విధానం కూడా అస్తవ్యస్తంగా ఉందని, అసలు రవాణా వ్యవస్థను క్రమబద్దీకరించేందుకే ఫ్లై ఓవర్ లు నిర్మిస్తారని, అలాంటిది విశాఖ లోని ఎన్ ఏ డి ఫ్లై ఓవర్ పై రవాణా యే పెద్ద అస్తవ్యస్తంగా ఉందన్నారు.  

ఆటో డ్రైవర్లు సైతం ఈ ఫ్లై ఓవర్ పై నుంచి ప్రయాణించాలంటే చాలా

భయపడుతున్నట్టు వారే స్వయంగా తెలిపారన్నారు. 

ప్రస్తుతం అధికారం లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పట్టణాభివృద్ధి శాఖామంత్రి వున్న  బొత్స సత్యనారాయణ కూడా ఈ ఫ్లై ఓవర్ ప్రమాదాలపై ఏమాత్రం దృష్టిపెట్టక పోవడం తో అతను కూడా భాద్యత వహించాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పై కేంద్రానికి

ఫిర్యాదు : . .  
 
కేంద్ర నిధులతో తయారు చేసిన ఈ ఫ్లై ఓవర్ దేశంలో ఎంతో గొప్పగా ఉంటుందని, విశాఖనగరానికే తలమానికంగా ఉంటుందని కేంద్రం భావించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులను ప్రక్కదారి పట్టించి, దీన్ని అత్యంత నాసిరకంగా తయారు చేసి, ప్రజల ప్రాణాలు పోయేందుకు రాజమార్గంగా చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర

ప్రభుత్వాన్ని భాద్యుల్ని చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆయన్ని ఒకసారి విశాఖ నగరం లో పర్యటించి, ఈ నిధుల కేటాయింపుల పై పూర్తి సమీక్ష జరపాలని కోరనున్నట్టు జివిఎల్ తెలిపారు. 

ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ పోలీస్ ఇక్కడే ఉన్నారు:.. .

దేశం లో

ఎక్కడా లేని విధంగా ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ నియంత్రణ చెయ్యడానికి పొలిసులు ఉండడం కేవలం విశాఖపట్నం లోనే ఉండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అసలు ట్రాఫిక్ సమస్య ను తగ్గించడానికి ఫ్లై ఓవర్ నిర్మిస్తారని, అలాంటిది అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ వస్తోందంటే. . . ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తోందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam